Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూబ్లీహిల్స్ అత్యాచారం కేసు : మైనర్ నిందితులకు బెయిల్

Webdunia
గురువారం, 28 జులై 2022 (08:48 IST)
హైదరాబాద్ జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచారం కేసులో నిందితులుగా ఉన్న నలుగురు మైనర్లకు జువైనల్ జస్టిస్ బోర్డు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఈ నలుగురు నిందితులు మంగళవారం సాయంత్రం జువైనల్ హోం నుంచి విడుదలయ్యారు. 
 
గత మే నెల 28వ తేదీన 17 యేళ్ల మైనర్ బాలికపై అత్యాచానికి పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో నలుగురు మైనర్ బాలుర్లతో పాటు ఒక మేజర్ సాహుద్దీన్ మాలిక్‌లు కలిసి అత్యాచారానికి పాల్పడినట్టు గుర్తించి వారిని అరెస్టు చేశారు. 
 
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ అత్యాచారం జూబ్లీహిల్స్ సమీపంలోని ఓ ఏకాంత ప్రదేశంలో కారులోనే జరిగింది. మద్యంపార్టీకి వెళ్లిన బాలికపై కొందరు యువకులు ట్రాప్ చేసి, ఇంటివద్ద దించుతామని మాయమాటలు చెప్పి అత్యాచారం చేశారు. 
 
ఈ కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టి దాదాపు 400 పేజీలతో కూడిన చార్జిషీటును సిద్ధం చేశారు. నిందితుల కాల్ లిస్ట్, ఫోరెన్సిక్‌ సైన్స్‌ రిపోర్టులు, డీఎన్‌ఏ రిపోర్టులు, ఇతర సంబంధిత ఆధారాలను పోలీసులు సేకరించారు. ఈ కేసులో దాదాపు 24 మంది సాక్షులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసులోని నలుగురు మైనర్లకు జువైనల్ జస్టిస్ బోర్డు బెయిల్ మంజూరుచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కానిస్టేబుల్స్ అంటే నాకు చాలా ఇష్టం : కమీషనర్ సి.వి.ఆనంద్

సంబరాల ఏటిగట్టు సెట్ లో సాయిదుర్గ తేజ్ ఫ్యాన్స్ కు ఏంచెప్పారో తెలుసా

శివరాత్రికి ప్రజ్వల్ దేవరాజ్ రాక్షస సిద్ధమైంది

బకెట్‌ ని వెపన్ గా పట్టుకొని నాగ చైతన్య తండేల్ ఫైట్

విక్టరీ వెంకటేష్ లాంచ్ చేసిన విశాల్ మదగజరాజా ట్రైలర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ ఆధ్వర్యంలో నార్త్ కరోలినాలో ఘనంగా రంగోలి పోటీలు

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తెలంగాణ, ఏపిలో అధునాతన హెమటాలజీ ఎనలైజర్‌ను పరిచయం చేసిన ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్

డయాబెటిస్‌‌‌‌కు బై చెప్పే సూపర్ టీ.. రోజుకు 2 కప్పులు.. 3 వారాలు తీసుకుంటే?

జాతీయ బాలికా దినోత్సవం 2025 : సమాజంలో బాలికల ప్రాముఖ్యత ఏంటి?

తర్వాతి కథనం
Show comments