Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుటుంబ కలహాలు - విజయవాడలో సీఐడీ సీఐ భార్య ఆత్మహత్య

Webdunia
మంగళవారం, 17 జనవరి 2023 (09:59 IST)
విజయవాడ నగరంలో ఓ విషాదకర ఘటన ఒకటి జరిగింది. కుటుంబ కలహాల కారణంగా సీఐడీ విభాగంలో సీఐగా పనిచేసే ఆఫీసర్ భార్య ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తి సీఐడీ విభాగంలో సీఐగా పని చేస్తున్నారు. ఈయన తన భార్య జ్యోతి (34)తో కలిసి విజయవాడ పటమట తోటవారి వీధిలో కాపురం ఉంటున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 
 
అయితే, సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో పిల్లలకు భోజనం వడ్డించే విషయంలో భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఆ తర్వాత చంద్రశేఖర్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన జ్యోతి... బెడ్ రూమ్‌లోకి వెళ్లి తలుపులు వేసుకుని ఫ్యానుకు ఉరేసుకుంది. 
 
ముగ్గురు కుమార్తెలు పెద్దగా అరుస్తూ తలుపులు కొట్టినప్పటికీ ఆమె తలుపులు తెరవలేదు. దీంతో పిల్లలు తమ తండ్రి చంద్రశేఖర్‌కు ఫోన్ చేసి విషయం చెప్పారు. ఆయన హుటాహుటిన వచ్చి చూడగా, అప్పటికే జ్యోతి ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments