Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుటుంబ కలహాలు - విజయవాడలో సీఐడీ సీఐ భార్య ఆత్మహత్య

Webdunia
మంగళవారం, 17 జనవరి 2023 (09:59 IST)
విజయవాడ నగరంలో ఓ విషాదకర ఘటన ఒకటి జరిగింది. కుటుంబ కలహాల కారణంగా సీఐడీ విభాగంలో సీఐగా పనిచేసే ఆఫీసర్ భార్య ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తి సీఐడీ విభాగంలో సీఐగా పని చేస్తున్నారు. ఈయన తన భార్య జ్యోతి (34)తో కలిసి విజయవాడ పటమట తోటవారి వీధిలో కాపురం ఉంటున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 
 
అయితే, సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో పిల్లలకు భోజనం వడ్డించే విషయంలో భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఆ తర్వాత చంద్రశేఖర్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన జ్యోతి... బెడ్ రూమ్‌లోకి వెళ్లి తలుపులు వేసుకుని ఫ్యానుకు ఉరేసుకుంది. 
 
ముగ్గురు కుమార్తెలు పెద్దగా అరుస్తూ తలుపులు కొట్టినప్పటికీ ఆమె తలుపులు తెరవలేదు. దీంతో పిల్లలు తమ తండ్రి చంద్రశేఖర్‌కు ఫోన్ చేసి విషయం చెప్పారు. ఆయన హుటాహుటిన వచ్చి చూడగా, అప్పటికే జ్యోతి ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments