Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మూసాపేట మెట్రో స్టేషన్‌లో రైలు కింద దూకిన వ్యక్తి ఆత్మహత్య

మూసాపేట మెట్రో స్టేషన్‌లో రైలు కింద దూకిన వ్యక్తి ఆత్మహత్య
, శుక్రవారం, 6 జనవరి 2023 (13:42 IST)
హైదరాబాద్ నగరంలోని మూసాపేట మెట్రో స్టేషన్‌లో ఓ వ్యక్తి మెట్రో ట్రైన్‌‍ కింద దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సదరు వ్యక్తి టిక్కెట్ లేకుండా మెట్రో స్టేషన్ నుంచి ఫ్లాట్‌పాంపైకి వెళ్లి మెట్రో టైన్‌ వస్తుండగా దూకేశాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఈ ఘటనపై మూసాపేట్ స్టేషన్ కంట్రోలర్ పులెందర్ రెడ్డి పోలీసులు ఫిర్యాదు చేశాడు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాల కోసం పోలీసుల ఆరా తీస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైలు ప్రయాణికుడిని చితక్కొట్టిన టీసీలు.. సస్పెండ్ చేసిన రైల్వే శాఖ