Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలి కోసం ఖర్చు చేసిన లెక్కలు రాసిపెట్టి ప్రియుడు ఆత్మహత్య

Webdunia
బుధవారం, 1 జూన్ 2022 (08:14 IST)
ఆ యువతిని ఓ యువకుడు తొమ్మిదేళ్ళగా ప్రేమిస్తున్నాడు. ఆమె కోసం రూ.4.50 లక్షల వరకు ఖర్చు చేశాడు. కానీ, ఇంతలో ఏమైందో ఏమోగానీ ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పైగా, తన ప్రియురాలి కోసం ఖర్చు చేసిన రూ.4.50 లక్షలను వసూలు చేయాలంటూ సూసైడ్ నోట్ రాసిపెట్టిమరీ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలోని చిక్‌మగళూరులో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చేతన్ (31) అనే యువకుడు శంకరపురకు చెందిన ఓ యువతిని తొమ్మిదేళ్లుగా ప్రేమిస్తూ వచ్చాడు. సరకు రవాణా వాహనాన్ని నడుపుతూ జీవితాన్ని గడుపుతూ వచ్చిన చేతన్.. తన ప్రియురాలి సరదాలు తీర్చేందుకు తన వేతనంలో సగం జీతం ఖర్చు చేసేవాడు. తన ప్రియురాలు సంతోషంగా ఉంటే చాలని చేతన్ భావించాడు. 
 
కానీ, ఆమె మాత్రం అతన్ని పెళ్లి చేసుకునేందుకు నిరాకరించింది. దీంతో తీవ్ర మనస్తాపానికిగురైన చేతన్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన ప్రియురాలి సంతోషాల కోసం తాను ఖర్చు చేసిన రూ.4.50 లక్షలను ఆమె నుంచి వసూలు చేయాలంటూ సూసైడ్ లేఖ రాసిపెట్టి చనిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments