Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్లోరిడాలో పారాసెయిలింగ్ ప్రమాదంలో బాపట్ల మహిళ మృతి

Webdunia
బుధవారం, 1 జూన్ 2022 (07:52 IST)
అమెరికాలో జరిగిన  పారాసెయిలింగ్ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్లకు చెందిన సుప్రజ (34) అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈమెకు భర్త శ్రీనివాసరావు, అక్షిత్ చౌదరి, శ్రీ అధిరా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, కుమారుడు అక్షిత్‌తో కలిసి సుప్రజ బోటు పారాసెయిలింగ్ చేస్తుండగా, ఒక్కసారిగా వాతావరణం ప్రతికూలంగా మారిపోయింది. 
 
బలమైన గాలులు వీయడంతో ఆ పారాచ్యూట్‌ను బోటుకు అనుసంధానించిన తాళ్లు తెగిపోయాయి. దీంతో ఆ పారాచ్యూట్ ఓ వంతెనను బలంగా తాకడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన సుప్రజ ప్రాణాలు కోల్పోగా, కుమారుడు తేలికపాటి గాయాలతో బయటపడ్డాడు. 
 
ఇదిలావుంటే, బాపట్ల జిల్లా మార్టూరు మండలం చింతపల్లిపాడుకు చెందిన శ్రీనివాసరావు దంపతులు గత 2012లో అమెరికా వెళ్ళారు. శ్రీనివాస రావు షికాగోలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తూ అక్కడే స్థిరపడ్డారు. అక్కడ నుంచి తమ మకాంను ఫ్లోరిడాకు మార్చారు. అక్కడ భార్యాపిల్లలతో ఉంటున్న సుప్రజ ఇలా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం ఆ కుటుంబాన్ని తీవ్రంగా కలిచివేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments