Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్, డ్రాయర్లతో అపార్టుమెంటులోకి దూరి..?

Webdunia
సోమవారం, 4 అక్టోబరు 2021 (14:55 IST)
ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో రోజురోజుకు దొంగతనాలు పెరిగిపోతున్నాయి. ఇంటికి తాళం వేసి వెళితే తిరిగొచ్చేసరికి ఇంట్లోని విలువైన వస్తువులు ఉంటాయో లేదోనన్నది అనుమానమే. అంతేకాదు ఇంట్లో ఉన్నా కూడా దొంగలు చాకచక్యంగా దూరి దొంగతనానికి పాల్పడుతున్నారు
 
అలాంటి ఘటనే తిరుపతిలో జరిగింది. ఈరోజు తెల్లవారుజామున విద్యానగర్ లోని ఒక అపార్టుమెంటులో చెడ్డీ గ్యాంగ్ తిరుగుతున్న దృశ్యాలు సిసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. నిన్న రాత్రి తమ అపార్టుమెంట్లో దొంగతనం జరిగిందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగారు పోలీసులు.
 
అయితే తలుపులు వేసినా ఓ బ్యాంకు ఉద్యోగి ఇంట్లోకి దూరిన దొంగలు 30 గ్రాముల బంగారం, 25 వేల రూపాయల వెండి, 5 వేల రూపాయల నగదును ఎత్తుకెళ్ళారు. అక్కడున్న సి.సి.టివి ఫుటేజ్ లను పరిశీలించారు. నగరంలోకి చెడ్డీ గ్యాంగ్ ప్రవేశించిందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. అపార్టుమెంట్, ఇంటికి తాళాలు వేసినా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు.
 
రాత్రి సమయాల్లో పోలీసు నిఘా మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం కనబడుతోంది. తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ తిరుగుతున్నారన్న విషయం ఇప్పుడు నగర ప్రజలను ఆందోళన కలిగిస్తోంది. చెడ్డీ గ్యాంగ్‌ను పట్టుకునే పనిలో పడ్డారు  పోలీసులు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments