Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అక్టోబరు 7 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

అక్టోబరు 7 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
, బుధవారం, 22 సెప్టెంబరు 2021 (07:48 IST)
తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వేంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అక్టోబరు 7 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు తితిదే నిర్ణయం తీసుకున్నట్టు ఈవో జవహర్‌ రెడ్డి వెల్లడించారు. 
 
ఈ బ్రహ్మోత్సవాల సమయంలో రోజుకు 500 నుంచి 1000 మందికి స్వామి దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల సంఖ్యను పెంచడంతోపాటు త్వరలో ఆన్‌లైన్‌లో జారీచేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. 
 
ఇదుకోసం టీటీడీ వెబ్‌సైట్‌లో ప్రత్యేక పోర్టల్‌ను రూపొందించారు. శ్రీవారి సర్వదర్శన టోకెన్ల జారీ కేంద్రం వద్ద సోమవారం రాత్రి తోపులాట జరిగింది. చిత్తూరు జిల్లాతోపాటు ఇతర ప్రాంతాల వారికి సైతం సర్వదర్శన టోకెన్లను జారీ చేయనున్నట్టు టీటీడీ ప్రకటించడంతో భక్తులు భారీసంఖ్యలో రావడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

22-09-2021 బుధవారం రాశిఫలాలు - లక్ష్మీనృశింహస్వామి ఆరాధించినా...