Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం మత్తులో తమ్ముడిని చంపేసిన అన్న... ఎక్కడ?

Telangana
Webdunia
శుక్రవారం, 12 నవంబరు 2021 (08:38 IST)
తెలంగాణా రాష్ట్రంలోని పాలమూరు మహబూబాబాద్‌ జిల్లాలోని దంతాలపల్లి మండలంలో దారుణం జరిగింది. మండలంలోని రేపోనిలో మద్యం మత్తులో తమ్ముడిని అత్యంత కిరాతకంగా చంపేశాడో అన్న. 
 
ఈ గ్రామానికి చెందిన వెంకన్న, గంగయ్య అనే ఇద్దరు అన్నదమ్ములు. గురువారం రాత్రి వీరిద్దరూ కలిసి మద్యం సేవించారు. అయితే ఇద్దరిమధ్య చెలరేగిన వివాదం పెద్దదిగా మారింది. 
 
దీంతో మద్యంమత్తులో ఉన్న వెంకన్న ఆవేశంతో చేతికందిన గొడ్డలితో గంగయ్యని నరికాడు. తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. 
 
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ హత్యపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వామ్మో... జాన్వీ కపూర్‌కు అంత కాస్ట్లీ గిఫ్టా?

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments