Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్తయ్యా మీ అమ్మాయి గుండెపోటుతో చనిపోయింది: అత్తకు అల్లుడు ఫోన్, కానీ...

ఐవీఆర్
సోమవారం, 3 మార్చి 2025 (12:39 IST)
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలోని మలక్ పేటలో ఓ వివాహిత అనుమానస్పద రీతిలో మృతి చెందింది. కానీ అల్లుడు మాత్రం తన భార్య గుండెపోటుతో చనిపోయిందని అంటున్నాడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
 
మలక్ పేటలోని జమునా టవర్స్‌లో సింగం శిరీష, వినయ్ కుమార్ దంపతులు నివాసం వుంటున్నారు. ఐతే శిరీష్ తల్లిదండ్రులకు పిడుగు లాంటి వార్త చెప్పాడు అల్లుడు వినయ్. ఫోన్ చేసి... అత్తయ్యా.. మీ అమ్మాయి గుండెపోటుతో చనిపోయింది అని చెప్పాడు. ఈ మాట విని షాక్ తిన్న శిరీష తల్లిదండ్రులు హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు. వారి తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరేలోపే వినయ్... భార్య శవాన్ని తన సొంత గ్రామం శ్రీశైలం లోని దోమలపెంటకు తీసుకుని వెళ్లేందుకు ప్రయత్నించాడు. 
 
ఈ విషయం తెలుసుకున్న శిరీష తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే మృతురాలి భౌతికకాయం తరలించకుండా అడ్డుకుని పరిశీలించారు. మృతురాలి శరీరంపై గాయాలు వుండటంతో... తమ అల్లుడు తమ కుమార్తెను కొట్టి చంపేసి గుండెపోటు అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడంటూ వారు పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ ఆరోగ్యంగా ఉన్నారు.. తప్పుడు ప్రచారం వద్దు

Vinayak: దర్శకులు వీ వీ వినాయక్ ఆరోగ్యం గా వున్నారంటున్న వినాయక్ టీమ్

Kiran Abbavaram: దిల్ రూబా స్టోరీ లైన్ చెప్పు, బైక్ గిఫ్ట్ కొట్టు : కిరణ్ అబ్బవరం

సినిమా ప్రశాంతతను కలిగించాలి, అసహ్యం కలిగించకూడదు : వెంకయ్య నాయుడు

ఆస్కార్ 2025 విజేతలు వీరే : భారతీయ చిత్రం అనూజకు అవార్డు దక్కిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

తర్వాతి కథనం
Show comments