అత్తయ్యా మీ అమ్మాయి గుండెపోటుతో చనిపోయింది: అత్తకు అల్లుడు ఫోన్, కానీ...

ఐవీఆర్
సోమవారం, 3 మార్చి 2025 (12:39 IST)
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలోని మలక్ పేటలో ఓ వివాహిత అనుమానస్పద రీతిలో మృతి చెందింది. కానీ అల్లుడు మాత్రం తన భార్య గుండెపోటుతో చనిపోయిందని అంటున్నాడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
 
మలక్ పేటలోని జమునా టవర్స్‌లో సింగం శిరీష, వినయ్ కుమార్ దంపతులు నివాసం వుంటున్నారు. ఐతే శిరీష్ తల్లిదండ్రులకు పిడుగు లాంటి వార్త చెప్పాడు అల్లుడు వినయ్. ఫోన్ చేసి... అత్తయ్యా.. మీ అమ్మాయి గుండెపోటుతో చనిపోయింది అని చెప్పాడు. ఈ మాట విని షాక్ తిన్న శిరీష తల్లిదండ్రులు హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు. వారి తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరేలోపే వినయ్... భార్య శవాన్ని తన సొంత గ్రామం శ్రీశైలం లోని దోమలపెంటకు తీసుకుని వెళ్లేందుకు ప్రయత్నించాడు. 
 
ఈ విషయం తెలుసుకున్న శిరీష తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే మృతురాలి భౌతికకాయం తరలించకుండా అడ్డుకుని పరిశీలించారు. మృతురాలి శరీరంపై గాయాలు వుండటంతో... తమ అల్లుడు తమ కుమార్తెను కొట్టి చంపేసి గుండెపోటు అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడంటూ వారు పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments