Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరేళ్ల బాలికపై వృద్ధుడు అఘాయిత్యం...

వరుణ్
సోమవారం, 15 జులై 2024 (14:27 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలంలో ఒక అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఆరేళ్ల చిన్నారిపై వరుసకు తాత అయిన వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీన్ని చూసిన స్థానికులు అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా, తప్పించుకుని పారిపోయాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు నార్లవలసో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. 
 
పోలీసుల కథనం మేరకు.. చిన్నారిని ఊయలలో వేసిన తల్లి కిరాణషాపుకు వెళ్లడం, ఇంట్లో ఎవరూ లేకపోవడంతో నార్లవలసకు చెందిన బోయిన ఎరకన్న దొర పసిపాపపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చిన్నారి గుక్కపట్టి ఏడ్వడంతో అక్కడికి చేరుకున్న ఆమె అక్క తల్లికి విషయం చెప్పింది. విషయం గ్రామస్థులకు తెలియడంతో అందరూ కలిసి వృద్ధుడిని వెంబడించారు. అయినప్పటికీ వారికి చిక్కకుండా తప్పించుకున్నాడు. 
 
మరోవైపు, తీవ్రంగా గాయపడిన చిన్నారిని కుటుంబ సభ్యులు బాడంగి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం జిల్లా కేంద్రం విజయనగరంలోని ఘోష ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం పాప కోలుకున్నట్టు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నార్లవలసలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments