Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోసం చేసిన ప్రియుడిపై కత్తి - యాసిడ్‌తో యువతిదాడి!

ఠాగూర్
సోమవారం, 12 ఆగస్టు 2024 (08:59 IST)
ఏపీలోని అన్నమయ్య జిల్లా నందలూరులో ఓ యువతి తనను ప్రేమ పేరుతో మోసం చేసిన ప్రియుడిపై కత్తి, యాసిడ్‌తో దాడిచేసింది. కళ్యాణమండపానికి నేరుగా వచ్చిన ఆ యువతి ఈ దాడికి తెగబడింది. మరికొన్ని క్షణాల్లో పెళ్లిపీటలెక్కాల్సిన పెళ్ళి కుమారుడు తనను మోసం చేశాడని చెబుతూ ఓ యువతి అక్కడకు వచ్చి కత్తి, యాసిడ్‌తో వీరంగం చేసింది. ఈ హఠాత్పరిణామానికి అక్కడ ఉన్నవారంతా హతాశులయ్యారు. 
 
అన్నమయ్య జిల్లా నందలూరులో ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం.. రైల్వేకోడూరుకు చెందిన సయ్యద్‌ బాషా, తిరుపతికి చెందిన జయ అనే మహిళ పదేళ్లుగా సన్నిహితంగా ఉంటున్నారు. కొంత కాలం కిందట స్వగ్రామానికి వచ్చేసి ఓ యువతితో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నాడు. ఆదివారం వారి వివాహం జరుగుతోందని తెలుసుకున్న జయ.. కార్యక్రమానికి వచ్చి ప్రియుణ్ని నిలదీసింది. 
 
ఆ తర్వాత ఆగ్రహంతో ఊగిపోతూ తనతో తెచ్చుకున్న కత్తి, యాసిడ్‌తో అతనిపై దాడి చేసేందుకు యత్నించింది. ఈ క్రమంలో కరీష్మా అనే మహిళపై యాసిడ్‌ పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆగ్రహించిన బాషా.. కత్తితో జయపై దాడి చేయడంతో ఆమె కూడా తీవ్రంగా గాయపడ్డారు. వధువు తరపు బంధువులు పెళ్లిని నిలిపివేసి పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ అబ్దుల్‌ జహీర్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా పాత్ర మీనాక్షికి మానస శర్మ ఒక సజీవ ఉదాహరణ: నటి రితికా సింగ్ వ్యాఖ్య

వీరాంజనేయులు విహారయాత్ర కెరియర్ కి టర్నింగ్ పాయింట్.: నరేష్

హరి హర వీరమల్లు షూటింగ్ కు సిద్ధమవుతున్న పవన్ కళ్యాణ్

త్రివిక్రమ్‌ను ఇప్పటికైనా ప్రశ్నించండి ప్లీజ్.. పూనమ్ కౌర్

సత్య దేవ్, డాలీ ధనంజయ నటించిన జీబ్రా చిత్రం క్యారెక్టర్ రివీలింగ్ మోషన్-పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

తర్వాతి కథనం
Show comments