Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహేతర సంబంధం.. మంచం కింద డిటోనేటర్లు పెట్టి వీఆర్ఏ హత్య

ఠాగూర్
సోమవారం, 30 సెప్టెంబరు 2024 (10:41 IST)
వివాహేతర సంబంధం ఓ హత్యకు దారితీసింది. నిద్రిస్తున్న సమయంలో మంచం కింద డిటోనేటర్లు అమర్చి పేల్చడంతో వీఆర్ఏ ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ ఘటన ఏపీలోని వైఎస్ఆర్ జిల్లా వేముల మండలం కొత్తపల్లిలో చోటుచేసుకుంది. వీఆర్ఏ నరసింహా అనే వ్యక్తి తన ఇంట్లో నిద్రిస్తుండగా బాబు అనే వ్యక్తి మంచి కింద డిటోనేటర్లు పెట్టి పేల్చాడు. దీంతో నరసింహం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆయన భార్య సుబ్బలక్ష్మమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను వేంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు తేల్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
 
ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదుచేసి విచారిస్తున్నారు. నిందితుడు బాబును అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. వీఆర్ఏ నరిసింహంకు బాబు అనే వ్యక్తి భార్యతో సంబంధం ఉండటం వల్లే ఈ దారుణం జరిగినట్టు సమాచారం, కాగా, ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన నరసింహం భార్య సుబ్బలక్ష్మమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలియా భ‌ట్, వేదాంత్ రైనా జిగ్రా ట్రైలర్ అద్భుతం : రామ్ చరణ్, నన్ను కదిలించింది : రానా ద‌గ్గుబాటి

ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా కెఎస్ రామారావు విజయం

మల్లిక్ తేజ్‌పై కేసు.. నాపై ఎన్నోసార్లు అత్యాచారం చేశాడు..

సమంతకు వుమెన్‌ ఆఫ్‌ది ఇయర్‌ అవార్డు.. తగ్గేదేలే..!

ప్రకాశ్ రాజ్‌ను అంకుల్ అని పిలుస్తా.. ఆయనంటే గౌరవం వుంది.. విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments