Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచారం చేసిన వ్యక్తిని గదిలో బంధించిన ఎయిర్‌హోస్టెస్!

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2022 (14:05 IST)
తనపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడిని బాధితురాలు గదిలో బంధించింది. ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేసి పట్టించింది. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. బాధితురాలి వయసు 30 యేళ్లు. ఈమెకు ఆ కామాంధుడికి నెలన్నర క్రితం పరిచయమైంది. అంతలోనే ఆ వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు. 
 
30 యేళ్ళ ఎయిర్‌హోస్టెస్ ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో పని చేస్తున్నారు. ఈమెకు హర్జీత్ యాదవ్ అనే వ్యక్తి నెలన్నర క్రితం పరిచయమయ్యాడు. ఈ క్రమంలో బాధితురాలి ఇంటికే వెళ్లిన హర్జీత్ యాదవ్ లైంగిక దాడికి తెగబడ్డాడు. కాన్పూర్‌కు చెందిన ఈ వ్యక్తి ఒక రాజకీయ పార్టీకి బ్లాక్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నాడు. 
 
అయితే అత్యాచారానికి గురైన తర్వాత కూడా ఆమె ఏ మాత్రం ధైర్యాన్ని కోల్పోకుండా... ఆతన్ని గదిలో బంధించి పోలీసులకు ఫోన్ చేసింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు హర్జీత్ యాదవ్‌ను అరెస్ట్ చేశారు. ఆయనపై సెక్షన్ 376 (అత్యాచారం), 323 (ఒక వ్యక్తిని హింసించడం), 509 (మహిళ గౌరవాన్ని నాశనం చేయడం), 377 (ప్రకృతి విరుద్ధమైన చర్యలకు పాల్పడటం) కింద కేసులు నమోదు చేశారు. 
 
ఈ సందర్భంగా డిప్యూటీ పోలీస్ కమిషనర్ చందన్ చౌదరి మాట్లాడుతూ 30 ఏళ్ల బాధితురాలు ఎయిర్ హోస్టెస్‌గా పని చేస్తుందని, హర్జీత్ యాదవ్ ఆమెకు నెలన్నర క్రితం పరిచయమయ్యాడని తెలిపారు. మద్యం మత్తులో బాధితురాలి ఇంటికి వచ్చి ఆమెపై అత్యాచారం చేశాడని చెప్పారు. అతన్ని గదిలో బంధించి 112 నంబరుకు ఫోన్ చేసి సమాచారం చేరవేసిందని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం