Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో దారుణం: ఉద్యోగం వచ్చిందని పిలిపించి యువతిపై అఘాయిత్యం

ఐవీఆర్
శుక్రవారం, 10 మే 2024 (16:12 IST)
హైదరాబాదులోని మధురానగర్ లో దారుణం చోటుచేసుకున్నది. ఓ యువతికి ఉద్యోగం ఆశ చూపి పిలిపించి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు సంస్థ మేనేజర్. పోలీసులు వెల్లడించిన పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
 
మధురానగర్ లోని టెక్ ఫ్లో అనే సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం కోసం ఓ యువతి దరఖాస్తు చేసుకున్నది. ఆమెకి ఇంటర్వ్యూ కాల్ రావడంతో కంపెనీకి వెళ్లింది. అక్కడ సంస్థ మేనేజర్ మీకు ఉద్యోగం వచ్చిందని చెప్పాడు. దానితో సదరు యువతి ఆనందంలో మునిగిపోయింది. ఆ తర్వాత కొద్దిసేపటికి... ఉద్యోగంలో భాగంగా మీరు కొత్త సిమ్ కార్డును మీ ఫోనులో వేసుకోవాల్సి వుంటుంది అని చెప్పాడు. ఆమె సరేనని చెప్పి వెళ్లిపోయింది.
 
మళ్లీ మేనేజర్ కాల్ చేసి మీకు సిమ్ కార్డ్ ఆఫీసులో ఇవ్వడం కుదర్లేదు, రేపు మీరు జాయి కావాలి కదా... అందుకే మా ఇంటికి వచ్చి సిమ్ కార్డ్ కలెక్ట్ చేసుకోమని చెప్పాడు. అతడి మాటలు నమ్మిన యువతి అక్కడికెళ్లింది. యువతి లోపలికి రాగానే గడియపెట్టి ఆమెపై అఘాయిత్యం చేయబోయాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో చంపేస్తానంటూ భయపెట్టాడు. అక్కడి నుంచి తప్పించుకున్న యువతి మధురానగర్ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. యువతులు ఇలా ఉద్యోగాల ఆఫర్లంటూ వెళ్లేటపుడు చాలా అప్రమత్తంగా వుండాలని పోలీసులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments