Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరికొన్ని గంటల్లో ముహూర్తం.. పెళ్లి మండపంలో వరుడు మృతి!

Webdunia
శుక్రవారం, 27 జనవరి 2023 (09:04 IST)
మరికొన్ని గంటల్లో పెళ్లి జరగాల్సిన వరుడు గుండెపోటుతో పెళ్లి మండపంలోనే కన్నుమూశారు. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ఈ ఘటన జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఉట్నూరు పట్టణంలోని రావుల శంకరయ్య - భూలక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు రావుల సత్యనారాయణ చారి (34) అనే వ్యక్తిగి జగిత్యాలజిల్లా మెట్‌పల్లికి చెందిన ఓ యువతితో గురువారం ఉదయం వివాహం జరగాల్సివుంది. బుధవారం అర్థరాత్రి వరకు కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సరదాగా గడిపిన వరుడు.. ఉన్నట్టుండి ఒక్కసారిగా కప్పకూలిపోయాడు. 
 
దీన్ని గమనించిన స్నేహితులు, కుటుంబ సభ్యులు హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. పెళ్లి బాజాలు మోగాల్చిన ఇంటిలో చావుడప్పాలు మోగడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments