Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో ఉద్యోగంలో చేరిన మూడు రోజులకే శ్రీకాకుళంవాసి మృతి

Webdunia
శుక్రవారం, 27 జనవరి 2023 (08:48 IST)
అమెరికాలో విషాదం నెలకొంది. అగ్రరాజ్యంలోని ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరిన మూడు రోజులకే శ్రీకాకుళం చెందిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మూడు రోజుల క్రితం సీమన్ కంపెనీలో చేరిన రవికుమార్ అనే యువకుడు కంటెయినర్ నుంచి జారిపడి మృతి చెందాడు. 
 
మృతుడు శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలోని ఎం.సున్నాపల్లి గ్రామానికి చెందిన టి.రవికుమార్ (35)గా గుర్తించారు. ఈయన సీమన్ కంపెనీలో మూడు రోజుల క్రితం ఉద్యోగంలో చేశారు. నౌకలో పని చేసేందుకు మొత్తం 10 మందితో కలిసి ఈ నెల 17వ తేదీన అమెరికాకు వెళ్లాడు. మూడు రోజుల క్రితమే విధుల్లో చేరాడు. 
 
బుధవారం సాయంత్రం విధుల్లో ఉండగా, ప్రమాదవశాత్తు కంటెయినరు పైనుంచి జారిపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గురువారం మధ్యాహ్నం కంపెనీ ప్రతినిధులు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. మృతుడికి భార్య శ్రావణి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రవికుమార్ మరణవార్తతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments