అమెరికాలో ఉద్యోగంలో చేరిన మూడు రోజులకే శ్రీకాకుళంవాసి మృతి

Webdunia
శుక్రవారం, 27 జనవరి 2023 (08:48 IST)
అమెరికాలో విషాదం నెలకొంది. అగ్రరాజ్యంలోని ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరిన మూడు రోజులకే శ్రీకాకుళం చెందిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మూడు రోజుల క్రితం సీమన్ కంపెనీలో చేరిన రవికుమార్ అనే యువకుడు కంటెయినర్ నుంచి జారిపడి మృతి చెందాడు. 
 
మృతుడు శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలోని ఎం.సున్నాపల్లి గ్రామానికి చెందిన టి.రవికుమార్ (35)గా గుర్తించారు. ఈయన సీమన్ కంపెనీలో మూడు రోజుల క్రితం ఉద్యోగంలో చేశారు. నౌకలో పని చేసేందుకు మొత్తం 10 మందితో కలిసి ఈ నెల 17వ తేదీన అమెరికాకు వెళ్లాడు. మూడు రోజుల క్రితమే విధుల్లో చేరాడు. 
 
బుధవారం సాయంత్రం విధుల్లో ఉండగా, ప్రమాదవశాత్తు కంటెయినరు పైనుంచి జారిపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గురువారం మధ్యాహ్నం కంపెనీ ప్రతినిధులు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. మృతుడికి భార్య శ్రావణి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రవికుమార్ మరణవార్తతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మరో 100 జన్మలైనా.. రజనీకాంత్‌లాగే పుట్టాలనుకుంటున్నా... తలైవర్ భావోద్వేగం

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

Suresh Babu: ఎమోసనల్‌ డ్రామా పతంగ్‌ చిత్రం : సురేష్‌బాబు

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments