Webdunia - Bharat's app for daily news and videos

Install App

తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న కొడుకును హత్య చేయించిన తల్లి

ఐవీఆర్
శనివారం, 15 ఫిబ్రవరి 2025 (12:28 IST)
వావివరసలు మరిచి కన్నతల్లి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కొడుకుని హత్య చేయించింది ఓ తల్లి. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. ప్రకాశం జిల్లా వాస్తవ్యురాలైన సాలమ్మకు నలుగురు పిల్లలు. వీరిలో మూడో కుమారుడు శ్యాంబాబుకి 35 ఏళ్లు. ఐతే ఏ పనీ చేయకుండా మద్యం సేవిస్తూ, దొంగతనాలు చేస్తూ తల్లికి తలవంపులు తెచ్చేవాడు. మద్యం మత్తులో ఏం చేస్తున్నాన్నది కూడా తెలియకుండా తప్పతాగి బంధువుల అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడు. తల్లి మందలించడంతో ఆమె పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు.
 
కుమారుడి దుష్ప్రవర్తనతో పూర్తిగా విసిగిపోయిన ఆ తల్లి ఇక అతడిని లేకుండా చేయాలని నిశ్చయించుకున్నది. ఓ ఆటో డ్రైవరుకి సుపారీ ఇచ్చి తన కొడుకును హత్య చేయించింది. ఆటో డ్రైవర్ శ్యాంబాబును తన ఆటోలో ఎక్కించుకుని పూటుగా మద్యం పోయించి సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లి అతడిని హత్య చేసి అనంతరం శరీరాన్ని ముక్కలు చేసి పంట కాలువలో పడేసాడు. పొలం గట్టుపై రక్తపు మరకలు చూసిన స్థానికులు విషయాన్ని పోలీసులు అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తన కుమారుడిని హత్య చేయించింది తనేనని తల్లి అంగీకరించడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments