Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీవీ డిబెట్‌లో పిడిగుద్దుల వర్షం ... కరాచీ ప్రెస్ క్లబ్‌లో మినీ వార్

Webdunia
మంగళవారం, 25 జూన్ 2019 (16:35 IST)
అది లైవ్ కార్యక్రమం. రసవత్తరంగా చర్చా కార్యక్రమం సాగుతోంది. అందరూ చూస్తుండగా, ఇద్దరు నేతలు బాహాబాహీకి దిగి, పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఈ ఘటన పాకిస్థాన్‌‌లో జరిగింది. అధికార పార్టీ పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఎ- ఇన్సాఫ్‌ (పీటీఐ) నేత మసూర్‌ అలీ సియాల్‌, కరాచి ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడు ఇంతియాజ్‌ ఖాన్‌‌లు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీనికి కరాచీ ప్రెస్ క్లబ్ వేదిక అయింది. 
 
ఈ చర్చా కార్యక్రమంలో ప్రభుత్వంపై ఇంతియాజ్ విమర్శలు గుప్పిస్తుండగా, ఇద్దరు నేతల మధ్యా మాటమాట పెరిగింది. సహనం కోల్పోయిన మసూర్‌ అలీ అతన్ని కొట్టారు. దీంతో ఇంతియాజ్ సైతం ప్రతిదాడికి దిగారు. దీంతో చర్చా కార్యక్రమం రసాభాసగా మారగా, ఈ మొత్తం ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. వీరిని విడదీసేందుకు యాంకర్‌‌తో సహాయక సిబ్బంది, కార్యక్రమ నిర్వాహకులు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
కాగా, చిన్నపాటి యుద్ధం తర్వాత మసూర్‌ లైవ్‌ను కొనసాగించగా, ఇంతియాజ్ మాత్రం వెళ్లిపోయారు. ఆ తర్వాత చానెల్‌ తన లైవ్ షోను కొనసాగించింది. ఈ వీడియోను పాక్‌‌కు చెందిన ఓ మహిళా జర్నలిస్ట్‌ తన ట్విట్టర్ ఖతాలో షేర్ చేసుకున్నారు. 'దాడిచేయడమేనా నయా పాకిస్థాన్‌?' అని ఈ సందర్భంగా ఆమె ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments