Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరల్డ్ కప్ : ఫైనల్‌కు వెళ్లేది ఆ రెండు జట్లే .. వీవీఎస్ లక్ష్మణ్ జోస్యం

Webdunia
ఆదివారం, 30 జూన్ 2019 (11:23 IST)
ఇంగ్లండ్ వేదికగా ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టు సెమీస్‌కు చేరుకుంది. రెండో జట్టుగా భారత్ ఉంది. అయితే ఈ వరల్డ్ కప్ పోటీల్లో ఫైనల్‌కు వెళ్లే జట్లు భారత్, ఆస్ట్రేలియా మాత్రమేనని భారత క్రికెట్ దిగ్గజం వీవీఎస్. లక్ష్మణ్ జోస్యం చెప్పారు. 
 
దీనిపై ఆయన స్పందిస్తూ, ఈ ప్రపంచ కప్‌లో మిగిలిన జట్లతో పోల్చుకుంటే భారత్, ఆస్ట్రేలియా జట్లు అన్ని రంగాల్లో బలంగా ఉన్నాయన్నారు. బౌలింగ్‌లోనూ, బ్యాటింగ్‌లోనూ స‌మ‌తూకంతో ఉన్నాయ‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. 2003 ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్లో త‌ల‌ప‌డిన భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్లే జులై 14న లార్డ్స్ వేదిక‌గా జ‌రుగ‌నున్న‌ ఈ ప్రపంచ‌క‌ప్ ఫైన‌ల్ బ‌రిలోనూ దిగుతాయ‌న్నాడు.
 
ఇక‌, మ‌హేంద్ర సింగ్ ధోనీ వంటి అనుభ‌వ‌జ్ఞుడైన‌, తెలివైన ఆట‌గాడు జ‌ట్టుతో పాటు క‌లిసి ఉండ‌డం కోహ్లీ సేనకు లాభిస్తుందన్నారు. మైదానంలో ఆట‌ను చ‌ద‌వ‌డంలో ధోనీని మించిన ఆట‌గాడు లేడ‌ని, ధోనీ కీప‌ర్‌గా ఉండ‌డం బౌల‌ర్ల‌కు కూడా ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నాడు. త‌న ఆలోచ‌న‌ల‌ను కుర్రాళ్ల‌తో పంచుకోవ‌డానికి ధోనీ ఎప్పుడూ వెన‌కాడ‌డ‌ని చెప్పాడు. అయితే మిడిల్ ఓవ‌ర్ల‌లో బ్యాటింగ్ భారాన్ని ధోనీ తీసుకోవాల‌ని, అత‌ణ్ని నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దింపాల‌ని సూచించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇజ్రాయెల్‌ నిబద్ధతపై అనుమానాలు : ఇరాన్

ఏపీలో మూడు రోజుల విస్తారంగా వర్షాలు

సింగయ్య మృతి కేసు : ఆ కారు జగన్మోహన్ రెడ్డిదే..

బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అత్యాచారం

మాజీ సీఎం జగన్‌కు షాకివ్వనున్న జొన్నలగడ్డ పద్మావతి దంపతులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

తర్వాతి కథనం
Show comments