Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరల్డ్ కప్ : కోహ్లీ అర్థ శతకం... మందకొడిగా భారత బ్యాటింగ్ - 4 వికెట్లు డౌన్

Webdunia
గురువారం, 27 జూన్ 2019 (17:20 IST)
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ పోటీల్లో భాగంగా గురువారం మాంచెష్టర్‌లోని ఓల్డ్‌ట్రాఫోర్డ్ వేదికగా భారత్ - వెస్టిండీస్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 
 
అయితే, ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలు బరిలోకి దిగగా, రోహిత్ శర్మ తన వ్యక్తిగత స్కోరు 18 పరుగులకే ఔట్ అయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 29 రన్స్. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ 55 బంతుల్లో అర్థ సెంచరీ కొట్టి క్రీజ్‌లో ఉన్నారు. 
 
ఇలా భారత బ్యాటింగ్ కోలుకుంటున్న సమయంలో కేఎల్ రాహుల్ తన వ్యక్తిగత స్కోరు 48 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. అప్పటికి భారత్ స్కోరు 98. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన విజయ్ శంకర్ కూడా 14 పరుగులు మాత్రమే చేసి జట్టు 126 పరుగుల వద్ మూడో వికెట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. 
 
మూడు వికెట్లలో రోచో రెండు వికెట్లు పడగొట్టగా, హోల్డర్ ఒక వికెట్ నేలకూల్చాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ (51 నాటౌట్)తో కలిసి జాదవ్ (7) బ్యాటింగ్ చేస్తుండగా, రోచ్ బౌలింగ్‌లో జాదవ్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో భారత్ తన నాలుగో వికెట్‌ను 29 ఓవర్ల వద్ద కోల్పోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహా న్యూస్ చానెల్‌‍పై దాడిని తీవ్రంగా ఖండించిన పవన్ కళ్యాణ్

కాంగ్రెస్ నేతలంటే అపార గౌరవం... సీరియస్‌గా తీసుకోవద్దు : కొండా మురళి

భర్తకి 12 మంది స్త్రీలతో వివాహేతర సంబంధం, భార్యను 8 సార్లు కత్తితో పొడిచాడు

ఐఫోన్‌లో షూట్ చేస్తే రీల్స్ ఎక్కువగా వస్తాయనీ.. యువకుడి గొంతు కోశారు..

లాక్కెళ్లి గదిలో బంధిస్తే.. పారిపోయేందుకు యత్నించగా హాకీ స్టిక్‌తో తలపై కొట్టారు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

తర్వాతి కథనం
Show comments