Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వెస్టిండీస్‌ను భారత్ చిత్తుచిత్తుగా ఓడించాలంటున్న పాక్ ఆటగాళ్లు... ఎందుకు?

Advertiesment
world cup 2019
, గురువారం, 27 జూన్ 2019 (16:58 IST)
ఎవరి బాధ వారిది. సహజంగా పాకిస్తాన్ ఆటగాళ్లు కానీ ప్రజలు కానీ టీమిండియా చిత్తుగా ఓడిపోవాలని కోరుకుంటారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. పాకిస్తాన్ సీనియర్ ఆటగాడు మాత్రం మన జట్టు వెస్టిండీస్ జట్టుని చిత్తుచిత్తుగా ఓడించాలని కోరుకుంటున్నాడు. అంతేకాదు ఇంగ్లాండ్ జట్టుపై కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాడు. ఆయనే షోయబ్ అక్తర్.
 
ఇక అసలు విషయానికి వస్తే... భారత్ ఇప్పటి వరకు ఐదింటిలో నాలుగు మ్యాచ్‌లు గెలిచింది. ఇవాళ వెస్టిండీస్‌తో తలపడనుంది. తర్వాత ఇంగ్లండ్, బంగ్లాదేశ్, శ్రీలంకతో ఆడుతుంది. మరో రెండు మ్యాచుల్లో నెగ్గితో భారత్ సెమీ ఫైనల్‌కి చేరుతుంది. కనుక నాలుగు జట్లలో రెండు జట్లపై గెలిస్తే చాలంతే. 
 
ఐతే వెస్టిండీస్, ఇంగ్లాండుపైన కనుక ఓడిపోతే ఏం జరుగుతుంది. పాకిస్తాన్ జట్టుకు గడ్డు కాలం ఎదురవుతుంది. అదే.. ఈ రెండు జట్లు కనుక భారత జట్టుపై గెలిస్తే పాకిస్తాన్ జట్టుకి సెమీఫైనల్ అవకాశాలు సన్నగిల్లుతాయి. అందుకే... వెస్టిండీస్, ఇంగ్లాండ్ జట్లను చిత్తుగా భారత్ ఓడించాలని షోయబ్ అక్తర్ కోరుకుంటున్నారు. మిగిలిన పాకిస్తాన్ ఆటగాళ్ల పరిస్థితి కూడా ఇలాగే వుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వరల్డ్ కప్ : భారత్ బ్యాటింగ్ .. వైస్ కెప్టెన్ ఔట్