Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీ - రోహిత్ స్థానాలను భర్తీ చేసే యువ క్రికెటర్లు ఎవరు?

వరుణ్
గురువారం, 4 జులై 2024 (18:18 IST)
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భారత క్రికెట్ జట్టు విశ్వవిజేతగా నిలిచింది. ఈ మెగా ఈవెంట్ తర్వాత భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలు అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశారు. అయితే, ఇపుడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల స్థానాలను భర్తీ చేసే యువ క్రికెటర్లు ఎవరన్న దానిపై ముమ్మరంగా చర్చ సాగుతుంది. ఇదే అంశంపై వివిధ రకాలైన పోల్స్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ సంస్థ నిర్వహించిన ఓటింగ్‌లో ఊహించిన ఫలితాలు వచ్చాయి. అయితే, మూడో స్థానం కోసం మాత్రం హోరాహోరీ పోటీ తప్పలేదు. 
 
భారత క్రికెట్ జట్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల వారసత్వాన్ని శుభ్‌మన్‌ గిల్‌, యశస్వి జైస్వాల్‌ ముందుకు నడిపిస్తారని పాఠకులు అభిప్రాయపడ్డారు. వీరిద్దరి తర్వాత ఎవరు అనేది తెలిపే మూడో స్థానం కోసం కేఎల్‌ రాహుల్‌, అభిషేక్‌ శర్మ మధ్య నువ్వా నేనా అనేలా పోటీ నడిచింది. ఆఖరికి యువ ఓపెనర్‌ అభిషేక్‌కే మూడో స్థానం దక్కింది. 
 
కాగా, ఈ పోలింగ్‌లో యశస్వి జైస్వాల్‌ - 66.7 శాతం, శుభ్‌మన్‌ గిల్‌ - 58.3, అభిషేక్‌ శర్మ - 24.7, కేఎల్‌ రాహుల్‌ - 21.7, రుతురాజ్‌ గైక్వాడ్‌ - 17.9, ఇషాన్‌ కిషన్‌ - 5.5, సాయి సుదర్శన్‌ - 4.1, దేవదత్‌ పడిక్కల్‌ - 1 చొప్పున ఓట్లు పోలయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హరిద్వార్ మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట.. భక్తుల మృతి

బెంగుళూరు తొక్కిసలాట : మృతదేహంపై బంగారు ఆభరణాలు చోరీ

కొండాపూర్‌లో రేవ్ పార్టీ... 50 ఓజీ కుష్ గంజాయి వినియోగం...

ఢిల్లీలో పాఠశాల బాత్రూమ్‌లో బాలుడిపై లైంగిక దాడి

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ఘన నివాళులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

తర్వాతి కథనం
Show comments