Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తుగా ఓడిన భారత్ : ర్యాంకుల పట్టికలో రెండో స్థానానికి...

ఠాగూర్
ఆదివారం, 3 నవంబరు 2024 (15:21 IST)
స్వదేశంలో పర్యాటక న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భారత చిత్తుచిత్తుగా ఓడిపోయింది. ముంబై వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో 147 పరుగుల స్వల్ప విజయలక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. దీంతో తొలి సారి స్వదేశంలో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను కోల్పోయింది. ఈ దారుణ పరాభవంతో డబ్ల్యూటీసీ ర్యాంకుల పట్టికలో భారత్ స్థానం కూడా పడిపోయింది. ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న టీమిండియా ఈ ఓటమితో రెండో స్థానానికి దిగజారింది. 
 
ప్రస్తుతం ఆస్ట్రేలియా 62.50 శాతంతో తొలి స్థానానికి చేరింది. భారత్ 58.33 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. శ్రీలంక (55.56) మూడో స్థానంలో ఉంది. భారత్‌పై టెస్టు సిరీస్‌ను నెగ్గిన కివీస్ 54.55 శాతంతో నాలుగుకు చేరింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా 54.17 శాతంతో ఐదులో కొనసాగుతోంది. 
 
భారత్ వరుసగా మూడు టెస్ట్ మ్యాచ్‌లలో ఓడిపోవడంతో ఇతర జట్లూ ముందుకు దూసుకురావడంతో భారత్‌కు కఠిన సవాల్‌ ఎదురుకానుంది. బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగే ఐదు టెస్టుల్లో భారత జట్టు తలపడనుంది. డబ్ల్యూటీసీ సైకిల్‌లో భారత్‌కు ఇదే చివరి సిరీస్‌. కనీసం 4 టెస్టుల్లో గెలిచి.. మరొక దానిని డ్రాగా ముగించాల్సి ఉంటుంది. ఒక్కటి ఓడినా.. ఫైనల్‌ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారడం ఖాయం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

తర్వాతి కథనం
Show comments