Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సౌతాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిన భారత్... పాయింట్ల పట్టికలో పతనం

Advertiesment
team india
, శుక్రవారం, 29 డిశెంబరు 2023 (09:18 IST)
సౌతాఫ్రికా పర్యటనలో భారత క్రికెట్ జట్టు తొలి టెస్టులో చిత్తుగా ఓడిపోయింది. కేవలం మూడు రోజుల్లోనే భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో భారత జట్టు ఇన్నింగ్స్ 34 పరుగులతో ఓడిపోయింది. ఫలితంగా పాయింట్ల పట్టికలో బాగా దిగజారిపోయింది. నాలుగు స్థానాలు దిగజారి ఐదో స్థానానికి పడిపోయింది. అదేసమయంలో ఈ విజయంతో సౌతాఫ్రికా జట్టు అగ్రస్థానానికి చేరుకుంది. సెంచూరియన్ టెస్టు ఫలితంతో డబ్ల్యూటీసీ పాయింట్లను వెల్లడించారు. 
 
ఈ తాజా ర్యాంకుల ప్రకారం ఆస్ట్రేలియా కంటే కాస్త ముందంజలో ఉన్నప్పటికీ ప్రపంచ టెస్ట్ చాంపియన్‌లో భాగంగా, మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్‌ డే టెస్టులో పాకిస్థాన్‌పై ఆస్ట్రేలియా విజయం సాధిస్తే మాత్రం పాయింట్ల పట్టికలో తారుమారుకానున్నాయి. 
 
డబ్ల్యూటీస పాయింట్ల పట్టికలో ప్రస్తుతం సౌతాఫ్రికా, పాకిస్థాన్ జట్లు తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. ఒక న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఇండియా, ఆస్ట్రలియా, వెస్టిండీస్, ఇంగ్లండ్ వరుస స్థానాల్లో నిలిచాయి. కాగా సెంచూరియన్ టెస్టులో భారత్ దారుణమైనరీతిలో ఓటమిపాలైంది. డబ్ల్యూటీసీ 2023-25లో సౌతాఫ్రికాకు ఇదే మొదటి సరీస్ కావడం గమనార్హం. దీంతో ఆ జట్టుకు 12 పాయింట్లు దక్కాయి. పాయింట్ల శాతం అన్ని జట్ల కంటే మెరుగ్గా ఉండటంతో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. 
 
గత రెండేళ్ల వ్యవధిలో సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలతో భారత్ ఒక టెస్టు మాత్రమే గెలిచింది. ఇంగ్లండ్ ఈ యేడాదే జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత్ ఓటమిపాలైంది. ఇక 2021లో సెంచూరియన్‌‍లో జరిగిన బాక్సింగ్ డై టెస్ట్ తర్వాత సౌతాఫ్రికాతో ఆడిన మూడు మ్యాచ్‌లలో ఓటమిపాలైంది. ప్రస్తుతం సౌతాఫ్రికా సిరీస్‌లో కేప్‍టౌన్ వేదికగా జరగనున్న చివరిదైన రెండో టెస్టులో గెలిచి సిరీస్‍‌ను సమం చేసుకుంటుందా, కనీసం డ్రా చేసుకోగలదా? అనేది వేచిచూడాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేక్షకులు లేని స్టేడియంలో ప్రేమజంట రాసలీలలు - ఇదిగో వీడియో...