Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యలు పిల్లలు సరే.. మరి ప్రియురాళ్ళ పరిస్థితి ఏంటి?

Webdunia
ఆదివారం, 26 మే 2019 (16:52 IST)
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌ టోర్నీకి ఇంగ్లండ్ అండ్ వేల్స్ ఆతిథ్యమివ్వనుంది. ఈ నెల 30వ తేదీ నుంచి ఈ టోర్నీ ప్రారంభంకానుంది. ఇందుకోసం టోర్నీలో పాల్గొనే వివిధ దేశాలకు చెందిన క్రికెట్ జట్లన్నీ ఇప్పటికే ఇంగ్లండ్‌కు చేరుకున్నాయి. 
 
అయితే, ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్‌లు ముగిసిన తర్వాత క్రికెటర్లు తమ భార్యాపిల్లలతో గడపవచ్చని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అనుమతి ఇచ్చింది. ప్రపంచ కప్‌కు తమ ఫ్యామిలీని పంపించాలని పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ గత నెలలో విజ్ఞప్తి చేశారు. దీన్ని పీసీబీ తిరస్కరించింది. 
 
కానీ, పాకిస్థాన్ క్రికెటర్లు కూడా భార్యాపిల్లలు తమ వెంట ఉండేందుకు అనుమతించాలని మరోమారు బోర్డుకు విజ్ఞప్తి చేశారు. వీరి వినతిని పరిశీలించిన బోర్డు... మ్యాచ్‌ ముగిసిన తర్వాత భార్యాపిల్లలతో క్రికెటర్లు ఉండేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో పాకిస్థాన్ క్రికెటర్లు తమ భార్యాపిల్లలను ఇంగ్లండ్‌కు పిలిపించుకునే పనిలో నిమగ్నమయ్యారు. 
 
పీసీబీ నిర్ణయం పట్ల వివాహిత క్రికెటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, బ్యాచిలర్ క్రికెటర్లు కూడా తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. తాము కూడా తమ ప్రియురాళ్లను వెంట తీసుకొచ్చుకునేందుకు అనుమతి ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 
 
కాగా, వరల్డ్ కప్ పోటీల్లో భాగంగా పాకిస్థాన్ - భారత్ క్రికెట్ జట్ల మధ్య మే 16వ తేదీన మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం టిక్కెట్లు హాట్ కేకుల్లా ఇప్పటికే అమ్ముడు పోయిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

45 సెకన్ల సమయం తమ తలరాతను మార్చింది... పాక్ ప్రధాని సలహాదారు

పూణెలో దారుణం : కొరియర్ బాయ్ ముసుగులో వచ్చి యువతిపై అత్యాచారం

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments