ఉప్పల్ మ్యాచ్‌ రీ షెడ్యూల్.. స్పందించిన బీసీసీఐ

Webdunia
సోమవారం, 21 ఆగస్టు 2023 (10:52 IST)
వన్డే ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా, హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ స్టేడియంలో వరుసగా రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇలా జరిగితే భద్రత కల్పించడం కష్టమని హైదరాబాద్ నగర పోలీసులు అంటున్నారు. అందువల్ల మ్యాచ్‌లను రీషెడ్యూల్ చేయాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధికారులు బీసీసీఐకు విజ్ఞప్తి చేస్తున్నారు. 
 
దీనిపై బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పందిస్తూ, 'వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లు జరుగనున్న హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియం ఇన్‌ఛార్జ్‌గా ఉన్నా. ఏదైనా సమస్య ఉంటే తప్పకుండా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తా. అయితే, వరల్డ్ కప్‌ మ్యాచ్‌ షెడ్యూల్‌ను మార్చడం అంత తేలిక కాదు. కేవలం బీసీసీఐ మాత్రమే షెడ్యూల్‌ను మార్చలేదు. మిగతా జట్లు, ఐసీసీ. క్రికెట్‌ సంఘాలు కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది' అని రాజీవ్ శుక్లా తెలిపారు. 
 
పాకిస్థాన్‌ మ్యాచ్‌ కావడంతో భద్రత మరింత కట్టుదిట్టంగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే హైదరాబాద్‌ పోలీస్‌, క్రికెట్‌ సంఘం ఆందోళన వ్యక్తం చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. షెడ్యూల్‌ ప్రకారం హైదరాబాద్‌ వేదికగానే పాకిస్థాన్‌ రెండు మ్యాచ్‌లు ఆడనుంది. అక్టోబర్ 6న నెదర్లాండ్స్‌తో, అక్టోబరు 10న శ్రీలంకతో తలపడనుంది. అలాగే రెండు వార్మప్‌ మ్యాచ్‌లను కూడా ఉప్పల్‌లోనే పాక్‌ ఆడనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి

పాకిస్థాన్ - ఆప్ఘనిస్తాన్ సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తతలు

మాజీ రాష్ట్రపతి ఎ.పి.జె. అబ్దుల్ కలాం జయంతి: గవర్నర్లు, సీఎంల నివాళులు

మహిళా కోచ్‌లో ప్రయాణం చేస్తున్న మహిళపై అత్యాచారం, దోపిడి.. కత్తితో బెదిరించి..?

ఆయన మారడు...సో... నేను లేనపుడు నాతో వచ్చిన వారు.. నాతోనే పోతారు.... మహిళ సెల్ఫీ వీడియో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

మెగా ఆఫర్ కొట్టేసిన మలయాళ బ్యూటీ

తర్వాతి కథనం
Show comments