Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాఖండే స్టేడియంలోని సీటుకు ఎంఎస్ ధోనీ పేరు..

Webdunia
మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (18:27 IST)
ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) వాంఖడే స్టేడియం వేదికపై 12 సంవత్సరాల క్రితం జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ స్మారకార్థం ఎంఎస్ ధోని పేరు పెట్టాలని నిర్ణయించింది. 50 ఓవర్ల ప్రపంచకప్‌ కోసం భారత్‌ 28 ఏళ్ల నిరీక్షణకు ధోనీతో తెరపడిన సంగతి తెలిసిందే. 
 
ఎంసీఏ పెవిలియన్‌లో ఆరుగురు దిగిన స్థలాన్ని గుర్తించామని.. ఆ ప్రాంతానికి అతి త్వరలో శాశ్వతంగా ఎంఎస్ ధోని పేరు పెట్టనుంది. రాష్ట్ర బోర్డు ప్రారంభోత్సవానికి 41 ఏళ్ల క్రికెటర్‌ను కూడా ఆహ్వానించిందని, అతనికి జ్ఞాపికను అందజేయాలని ఎంసీఏ యోచిస్తోంది.  
 
కాగా.. శ్రీలంకతో ఫైనల్‌లో ధోని కొట్టిన విన్నింగ్‌ సిక్స్‌ కొట్టి కోట్లాది భారతీయు కలను నిజం చేశాడు. నాడు ధోని కొట్టిన సిక్స్‌.. స్టేడియంలో ఓ సీటుపై పడింది. ఆ సీటుకు ఇప్పుడు ధోనీ పేరు పెట్టాలని ఎంసీఏ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ముంబై క్రికెట్‌ సంఘం (ఎంసీఏ) ప్రెసిడెంట్‌ అమోల్‌ ఖేల్‌ వెల్లడించారు.

వాంఖడే స్టేడియంలో కొన్ని స్టాండ్స్‌కు ఇప్పటికే సచిన్‌, గవాస్కర్‌, విజయ్ మర్చంట్‌ పేర్లు ఉన్నాయి. ప్రస్తుతం వినూత్నంగా సీటుకు ధోని పేరు పెడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ నంబర్ వుంటేనే తత్కాల్ టిక్కెట్లు బుకింగ్.. రైల్వే శాఖ

వైట్ కాలర్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఆటో డ్రైవర్!!

ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ రూ.15 వేలు: మంత్రి నారా లోకేశ్

మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)

జగన్ - భారతి వల్లే ఈ దరిద్రమంతా : ఆదినారాయణ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments