Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోబాల్స్ వేస్తే కొత్త కెప్టెన్ కింద ఆడాల్సి ఉంటుంది.. ధోనీ

Webdunia
మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (17:53 IST)
ఐపీఎల్ 16వ సీజన్‌ పోటీల్లో భాగంగా, సోమవారం రాత్రి లక్నో సూపర్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే జట్టు 12 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. అయితే, ఈ మ్యాచ్‌కు ముందు సీఎస్కే కెప్టెన్ ధోనీ తన జట్టు బౌలర్లతో మాట్లాడుతూ, ఫాస్ట్ బౌలర్లు తమ బౌలింగ్‌ను మెరుగుపరుకోవాలని, పరిస్థితులను బేరీజు వేస్తూ బౌలింగ్ చేయాలంటూ సూచించారు. 
 
అదేసమయంలో నోబాల్స్, వైడ్ బాల్స్ వేయొద్దని ఒకవేళ వేస్తే కనుక కొత్త కెప్టెన్ కింద ఆడాల్సి ఉంటుందని హెచ్చరించారు. పైగా, ఇది తన రెండో హెచ్చరిక అని, ఆ తర్వాత తాను తప్పుకుంటానని వార్నింగ్ ఇచ్చాడు. అదేవిధంగా చిదంబరం స్టేడియం పిచ్‌పై కూడా ఆయన స్పందించారు. ఐదారు సంవత్సరాల తర్వాత ఈ పిచ్‌పై తొలిసారి ఆడుతున్నట్టు చెప్పారు. పిచ్ చాలా నెమ్మదిగా ఉందని భావిస్తున్నట్టు చెప్పారు. అయితే, ధోనీ చెప్పినట్టుగానే బౌలర్లు గత మ్యాచ్‍‌లో కట్టుదిట్టమైన బౌలింగ్‌తో రాణించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హరిద్వార్ మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట.. భక్తుల మృతి

బెంగుళూరు తొక్కిసలాట : మృతదేహంపై బంగారు ఆభరణాలు చోరీ

కొండాపూర్‌లో రేవ్ పార్టీ... 50 ఓజీ కుష్ గంజాయి వినియోగం...

ఢిల్లీలో పాఠశాల బాత్రూమ్‌లో బాలుడిపై లైంగిక దాడి

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ఘన నివాళులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

తర్వాతి కథనం
Show comments