Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్న విరాట్ కోహ్లీ

Webdunia
బుధవారం, 15 జనవరి 2020 (13:45 IST)
భారతక్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ. టెస్టులు, వన్డేలు, ట్వంటీ20 ఫార్మెట్‌లలో అమితంగా రాణిస్తూ పరుగుల వరద పారిస్తున్నాడు. పైగా, పలు సందర్భాల్లో జట్టును ఒంటి చేత్తో గెలిపిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ ఖాతాలో మరో ప్రతిష్టాత్మక అవార్డు వచ్చి చేరింది. 
 
సాధారణంగా ప్రతి యేడాది ఐసీసీ వివిధ రకాల వార్షిక అవార్డులను ఇస్తూ వస్తోంది. ఈకోవలోనే 2019 సంవత్సరానికిగాను అన్ని ఫార్మాట్లలో, అన్ని విభాగాల్లోనూ ఉత్తమ ఆటగాళ్లను ఎంపిక చేసింది. ఇందులో భారత కెప్టెన్‌, రన్‌ మెషీన్‌ విరాట్‌ కోహ్లి స్పిరిట్‌ ఆఫ్‌ క్రికెట్‌ అవార్డుకు ఎంపికయ్యాడు. 
 
2019 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్‌ స్మిత్‌ను ప్రోత్సహించాలని విరాట్‌ తన సైగల ద్వారా అభిమానులకు సూచించాడు. ఎందుకంటే, దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో స్మిత్‌ కెప్టెన్సీలో.. వార్నర్‌ సహా మరో ఆటగాడు బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడిన విషయం తెల్సిందే. 
 
దీంతో స్మిత్‌, వార్నర్‌లకు ఏడాది నిషేధం విధించింది. నిషేధం పూర్తయిన తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన స్మిత్‌ను ఎవరూ పట్టించుకోకపోయే సరికి కోహ్లీ అభిమానులకు తన సైగల ద్వారా స్మిత్‌ను ప్రోత్సహించాలని సూచించాడు. ఇందుకుగానూ కోహ్లీకి స్పిరిట్‌ ఆఫ్‌ క్రికెట్‌ అవార్డు లభించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

హెచ్‌సీయూలో ఏప్రిల్ 3 వరకు పనులు ఆపండి.. తెలంగాణ హైకోర్టు ఆదేశం

వీధి కుక్కలకు చుక్కలు చూపిస్తున్న రోబో కుక్క (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

తర్వాతి కథనం
Show comments