Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త జెర్సీతో టీమిండియా.. వైరల్ అవుతున్న విరాట్ కోహ్లీ ఫోటో (video)

Webdunia
బుధవారం, 21 ఆగస్టు 2019 (16:20 IST)
అంతర్జాతీయ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కొత్త జెర్సీతో టీమిండియా బరిలోకి దిగుతోంది. వెస్టిండీస్‌తో జరిగిన టీ-20, వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. దీంతో గురువారం నుంచి ప్రారంభం కానున్న రెండు మ్యాచ్‌లతో కూడిన టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.

ఈ పోటీల్లో బరిలోకి దిగే టీమిండియా కొత్త జెర్సీతో కనిపించనుంది. అంతర్జాతీయ టెస్టు సిరీస్‌లో కొత్త జెర్సీలో టీమిండియా బరిలోకి దిగనుండటం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. 
 
వన్డే, టీ-20ల సందర్భంగా టీమిండియా క్రికెటర్లు జెర్సీల తరహాలోనే తాజా టెస్టు జెర్సీల్లో క్రికెటర్ల పేర్లు నెంబర్లు వుంటాయి. సంప్రదాయ టెస్టు మ్యాచ్‌ల్లో వున్న ప్రత్యేకతను ఈ జెర్సీలు అతిక్రమిస్తున్నాయని మాజీ క్రికెటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ.. ప్రస్తుత కాలానికి తగ్గట్లు కొన్ని మార్పులు చేయాల్సిన పరిస్థితి వున్నట్లు బీసీసీఐ అధికారులు చెప్తున్నారు. 
 
టెస్టు పోటీలను క్రికెట్ అభిమానులకు మరింత నచ్చేలా కొన్ని మార్పులు చేస్తున్నామని.. ఇందులో భాగంగా జెర్సీలను కూడా మార్చినట్లు బీసీసీఐ అధికారులు తెలిపారు. ఇకపోతే.. తాజాగా కొత్త జెర్సీతో కూడిన విరాట్ కోహ్లీ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments