Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కాలం.. భార్య కోసం విరాట్ కోహ్లీ ఏం చేశాడంటే?

Webdunia
ఆదివారం, 26 జులై 2020 (17:49 IST)
కరోనా నేపథ్యంలో లాక్​డౌన్​ తరుణంలో తన భార్య పుట్టిన రోజు సందర్భంగా భార్య అనుష్క శర్మ కోసం స్వయంగా తొలిసారిగా కేక్​ తయారుచేసినట్లు టీమిండియా సారథి విరాట్ కోహ్లీ తెలిపాడు. తాజాగా మయాంక్​ అగర్వాల్​తో సరదాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న కోహ్లీ.. పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. అలా భార్యకు తయారు చేసిపెట్టిన కేక్ తనకు బాగా నచ్చిందని తెలిపాడు. అది తనకెంతో ప్రత్యేకమైందని అనుష్క అతడితో చెప్పినట్లు గుర్తుచేసుకున్నాడు.
 
ఆ సందర్భం లాక్​డౌన్​ జ్ఞాపకంగా, తన జీవితంలో ప్రత్యేకమైనదిగా ఎప్పటికీ గుర్తుండిపోతుందని కోహ్లీ తెలిపాడు. దీంతో పాటు ఫిట్​నెస్​పై పూర్తి దృష్టి సారించినట్లు తెలిపాడు కోహ్లీ. అయితే స్ల్పిట్​, బల్గేరియన్​ స్క్వాడ్ వంటి ఎక్స్​ర్​సైజ్​లు చేయడానికి ఎక్కువ ఇష్టపడడని చెప్పాడు. పవర్​ స్నాచ్​ కసరత్తు చేయడం బాగుంటుందని చెప్పుకొచ్చాడు. బెండకాయతో చేసిన లహ్​సునీ పాలక్​ వంటకాన్ని ఇష్టపడతానని వెల్లడించాడు.
 
కాగా లాక్‌డౌన్‌లో ఇంటికే పరిమితమైన కోహ్లి రెగ్యులర్‌ ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడంతో పాటు, పుస్తకాలు చదవడం, కుటుంబంతో వీలైనంత సమయాన్ని గడపడం ద్వారా కరోనా కాలంలో తనను తాను బిజీగా ఉంచుకుంటున్నాడు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments