Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూఏఈ వేదికగా సెప్టెంబరులో ఐపీఎల్ - 51 రోజుల పాటు కాసుల పోటీలు

Webdunia
శుక్రవారం, 24 జులై 2020 (09:21 IST)
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్2020) పోటీలు వచ్చే సెప్టెంబరు నుంచి యూఏఈ వేదికగా ప్రారంభంకానున్నాయి. నిజానికి ఇదే నెలలో ఐసీసీ నిర్వహించే ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీలు జరగాల్సివుంది. కానీ, కరోనా వైరస్ భయం కారణంగా ఈ పోటీలకు ఆతిథ్యం ఇవ్వాల్సిన క్రికెట్ ఆస్ట్రేలియా చేతులెత్తేసింది. దీంతో ఈ పోటీలను ఐసీసీ వచ్చే యేడాదికి వాయిదావేసింది. దీంతో ఐపీఎల్ పోటీల నిర్వహణకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. 
 
ఈ పోటీల నిర్వహణకు దేశంలో ఈ యేడాది ఆఖరు వరకు పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా ఉండబోవని బీసీసీఐ భావిస్తోంది. దీంతో పోటీలను యూఏఈలో జరపాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 8 మధ్య ఈ పోటీలు జరిగే అవకాశాలు ఉన్నాయని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
 
ఈ విషయమై అన్ని ఫ్రాంచైజీలకూ బీసీసీఐ నుంచి సమాచారం వెళ్లిందని, పోటీల నిర్వహణపై వారి సలహాలు, సూచనలు కూడా తీసుకోనున్నామని ఓ అధికారి వెల్లడించారు. పోటీలు 51 రోజుల పాటు సాగుతాయి కాబట్టి, ప్రసార హక్కులను పొందిన కంపెనీలు, ఇతర వాటాదారులకు సైతం ఎటువంటి అభ్యంతరాలూ ఉండబోవని భావిస్తున్నట్టు పేరును వెల్లడించేందుకు ఇష్టపడని ఆ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.
 
వాస్తవానికి సెప్టెంబర్ 26 నుంచి ఈ పోటీలను ప్రారంభిస్తారని తొలుత వార్తలు వచ్చినప్పటికీ, ఐపీఎల్ ముగియగానే, ఆస్ట్రేలియా పర్యటనకు భారత క్రికెట్ జట్టు వెళ్లాల్సి వుండటం, ఆ దేశ ప్రభుత్వ నిబంధనల మేరకు ఆసీస్ వెళ్లిన ఆటగాళ్లంతా 14 రోజుల క్వారంటైన్ పాటించడం తప్పనిసరి కావడంతో, ఓ వారం ముందుగానే ఐపీఎల్‌ను ప్రారంభించాలని బీసీసీఐ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇక ఈ విషయంలో నేడో, రేపో అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం. 

సంబంధిత వార్తలు

ఆగస్టు 15లోగా రైతుల 2 లక్షల పంట రుణాల మాఫీ.. ఏర్పాట్లు ఆరంభం

41 రోజుల రాజశ్యామల సహస్ర చండీయాగంలో జగన్

పాఠ్యపుస్తకాల మందం తగ్గింది.. ఈసారి ఆ ఇబ్బంది వుండదు..

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments