Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు.. ధోనీ ఫీట్‌ను అధిగమించాడుగా..!

Webdunia
బుధవారం, 29 జనవరి 2020 (16:37 IST)
పరుగుల వీరుడు, కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు చేరింది. కెప్టెన్‌గా టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా కోహ్లీ రికార్డు నమోదు చేశాడు. ఇప్పటి వరకూ ఈ రికార్డు ఎంఎస్ ధోని పేరు మీద ఉంది.

ధోని 72 మ్యాచ్‌లలో 1112 పరుగులు చేయగా.. కోహ్లీ 36 మ్యాచ్‌లలో 1126 పరుగులు చేసి ఈ ఫీట్‌ను అధిగమించాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా మూడో టీ20 ఆడుతుంది. 
 
ఈ మ్యాచ్‌లో కోహ్లీ 27 బంతులలో 38 పరుగులు చేసి ధోని రికార్డును బద్దలు కోట్టాడు. ఈ లిస్టులో సౌతాఫ్రికా ఆటగాడు డూప్లిసెస్ 40 మ్యాచ్‌లలో 1273 పరుగులు చేసి మొదటిస్థానంలో ఉన్నాడు.

ఆ తర్వాత న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్ 41 మ్యాచ్‌లలో 1148 పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు. వీరిద్దరి తర్వాతా కోహ్లీ మూడోవాడిగా తన పేరును నమోదు చేసుకున్నాడు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments