Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ధోనీకి షాక్.. సెలక్షన్‌కు అందుబాటులో లేడు.. అందుకే పక్కనబెట్టేశారట..

ధోనీకి షాక్.. సెలక్షన్‌కు అందుబాటులో లేడు.. అందుకే పక్కనబెట్టేశారట..
, శనివారం, 31 ఆగస్టు 2019 (15:23 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి చుక్కెదురైంది. ప్రపంచ కప్ సెమీఫైనల్‌లో జట్టును గెలిపించలేకపోవడంతో ధోనీపై సెలక్టర్లు కన్నేయట్లేదు. ఇందులో భాగంగా ఆర్మీతో వుండిన ధోనీ.. దక్షిణాఫ్రికాతో జరిగే మూడు టీ-20 సిరీస్‌లో ఆడుతాడని అందరూ అనుకున్నారు

. అయితే  సొంతగడ్డపై వచ్చే నెలలో దక్షిణాఫ్రికాతో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు బీసీసీఐ గురువారం 15 మందితో కూడిన భారత జట్టును ప్రకటించింది. ఈ 15 మందిలో మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్‌ ధోనీకి చోటు దక్కలేదు. 
 
ధోనీని జట్టులోకి ఎందుకు తీసుకోలేదని ఎమ్మెస్కే ప్రశ్నించగా.. 'ధోనీ సెలక్షన్‌కు అందుబాటులో లేడు' అని సమాధానం ఇచ్చాడు. మరోవైపు 'ప్రస్తుతం ధోనీ అమెరికాలో ఉన్నాడు. తనకు తానుగా సెలక్షన్‌కు అందుబాటులో లేడు' అని ధోనీ సన్నిహితుడు ఒకరు స్పష్టం చేశారు. దీంతో.. ధోనీ ప్రస్తుతం అమెరికాలో ఉన్న కారణంగానే సెలక్టర్లు ఆయన్ని జట్టులోకి తీసుకోలేకపోయారని టాక్ వస్తోంది. కాగా వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌లో ధోనీ స్థానం దక్కించుకోవాలంటే మాత్రం ఫామ్‌, ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది.
 
ప్రపంచకప్‌ అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న స్టార్ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా మళ్లీ జట్టులో చోటు దక్కించుకున్నాడు. వరుసగా మ్యాచ్‌లు ఆడుతున్న పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు. ఈ ఒక్క మార్పు మినహా విండీస్‌తో టీ20ల్లో తలపడిన జట్టునే సెలెక్టర్లు కొనసాగించారు. హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, కృనాల్‌ పాండ్యా రూపంలో ప్రస్తుతం జట్టులో ముగ్గురు ఆల్‌రౌండర్‌లు ఉన్నారు.
 
జట్టు వివరాలు.. 
విరాట్ కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ (వైస్‌ కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, మనీష్‌ పాండే, రిషభ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), హర్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, కృనాల్‌ పాండ్య, వాషింగ్టన్‌ సుందర్‌, రాహుల్‌ చాహర్‌, ఖలీల్‌ అహ్మద్‌, దీపక్ చాహర్‌, నవదీప్‌ సైనీ.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అంబటి రాయుడు యూటర్న్ తీసుకున్నాడు.. భావోద్వేగంలో అలా జరిగిపోయింది..