Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీ అలా మాట్లాడకూడదు... దేశం కోసం ఆడాలి.. కపిల్ హితవు

Webdunia
గురువారం, 16 డిశెంబరు 2021 (10:56 IST)
టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలిగే సమయంలో కోహ్లీకి రాజీనామా చేయవద్దని తానే స్వయంగా చెప్పానని బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ తెలిపాడు. అయితే తనను ఎవరూ అడ్డుకోలేదని విలేకరుల సమావేశంలో ప్రస్తుత టీమిండియా టెస్టు కెప్టెన్ కోహ్లీ వెల్లడించాడు. ఈ వివాదంలోకి ప్రస్తుతం మాజీ స్టార్ ప్లేయర్ కపిల్ దేవ్ వచ్చారు.
 
కెప్టెన్ కోహ్లీ మాటలు బీసీసీఐ అధ్యక్షుడి మధ్య బహిరంగ వ్యాఖ్యలు భారత క్రికెట్ ప్రతిష్టను ప్రభావితం చేసిందని.. బోర్డు అధ్యక్షుడికి వ్యతిరేకంగా కోహ్లీ మాట్లాడకూడదని కపిల్ హితవు పలికాడు. 
 
"నేను కోహ్లీకి పెద్ద అభిమానిని, కానీ ఏ ఆటగాడు బీసీసీఐ అధ్యక్షుడికి లేదా బోర్డుకి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. నన్ను కెప్టెన్సీ నుండి తప్పించినప్పుడు, నేను కూడా చాలా బాధపడ్డాను, కానీ మీరు దేశం కోసం ఆడుతున్నారని గుర్తుంచుకోండి. అంతకు మించి ఇంకేమీ ముఖ్యం కాదు." అంటూ కపిల్ స్పష్టం చేశాడు.
 
ఈ మొత్తం రచ్చ తర్వాత బీసీసీఐ ఎలాంటి వివరణ ఇవ్వనప్పటికీ, ప్రస్తుత వివాదం టెస్టుల్లో కోహ్లీ కెప్టెన్సీని ప్రభావితం చేయకూడదని కపిల్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

సంబంధిత వార్తలు

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments