Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ తొలి జట్టుగా కేకేఆర్ సరికొత్త రికార్డు

ఠాగూర్
శుక్రవారం, 4 ఏప్రియల్ 2025 (10:18 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా, కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా గురువారం హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 80 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో కేకేఆర్ జట్టు ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. టోర్నీ చరిత్రలో మూడు జట్లపై 20 అంతకంటే ఎక్కువ విజయాలు సాధించిన జట్టుగా సరికొత్త రికార్డును నెలకొల్పింది. 
 
ఇప్పటివరకు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై 20, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుపై 20, పంజాబ్ కింగ్స్‌పై 21 చొప్పున విజయాలు నమోదు చేసుకుంది. అలాగే, సన్‌‍ రైజర్స్‌పై 2023-25 మధ్య వరుసగా 5 మ్యాచ్‌లలో కోల్‌కతా విజయం సాధించడం గమనార్హం. 
 
ఇక ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కూడా 2023-25 మధ్య వరుసగా ఐదు మ్యాచ్‌లలో హైదరాబాద్ జట్టుపై వరుసగా ఐదు మ్యాచ్‌లలో గెలుపొందింది. కాగా, ఐపీఎల్‌లో రన్స్‌‌పరంగా గురువారం నాటి మ్యాచ్‌లోనే సన్ రైజర్స్‌కు భారీ ఓటమి ఎదురైంది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు ఏకంగా 80 పరుగులు తేడాతో ఓడిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వరంగల్ యువత రోడ్ల ప్రవర్తన మార్చడంలో ముందడుగు

Sanam Shetty: పారిశుద్ధ్య కార్మికులతో సనమ్ శెట్టి నిరసన.. చిన్మయి, విజయ్‌కి తర్వాత? (Video)

Praja Rajyam: ప్రజా రాజ్యం, జనసేన పార్టీలను తొలగించిన ఈసీ.. నిజమేనా?

హైటెక్ భారతంలో అంబులెన్స్‌కు కరువాయె ... భార్య మృతదేహాన్ని బైకుకు కట్టి...

డిమాండ్ల పరిష్కారం కోసం షూటింగ్ బంద్ సబబు కాదు : మంత్రి కోమటిరెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

ప్రభుత్వ వాహనంలో నిధి అగర్వాల్.. క్లారిటీ ఇచ్చిన హరిహర వీరమల్లు హీరోయిన్

Madhu Shalini : మధు శాలిని ప్రెజెంట్స్ కన్యా కుమారి రిలీజ్ కు సిద్ధం

తర్వాతి కథనం
Show comments