Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా వస్తువులను నిషేధించాలి - కరోనా పాపం చైనాదే : సురేష్ రైనా

Webdunia
మంగళవారం, 23 జూన్ 2020 (15:42 IST)
భారత సైన్యంపై అతి కిరాతకంగా దాడి చేసి 20 మంది జవాన్లను పొట్టనపెట్టుకున్న చైనాపై భారత క్రికెటర్ సురేష్ రైనా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చైనా వస్తువులను తక్షణం నిషేధించాలని ఆయన పిలుపునిచ్చారు. భారత్‌పై దాడి చేసిన డ్రాగన్‌ దేశం మన డబ్బుతో నడవకుడదని, చైనా వస్తువులను నిషేధించాలని డిమాండ్ చేశారు. 
 
గాల్వాన్‌ లోయ వద్ద జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు మృతి చెందడంతో దేశ వ్యాపంగా చైనా వ్యతిరేక నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై సురేశ్‌రైనా స్పందించాడు. ప్రపంచంపై ఆధిపత్యం చెలాయించేందుకు చైనానే కరోనా వైరస్‌ను సృష్టించిందని అనుమానం వ్యక్తంచేశాడు. 
 
భారత భూమిని కాపాడేందుకు దేశ సైనికులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, వారి కుటుంబ సభ్యుల పరిస్థితి వర్ణణాతీతమని అన్నాడు. ‘భారత సైన్యం చాలా బాలమైంది. ప్రతీ ఒక్క భారత జవానుకు సెల్యూట్‌’ అని రైనా అన్నారు. 
 
దేశం తరుపున ఆడుతూ ప్రతి ఒక్కరూ గర్వపడేలా చేయడమే మా కర్తవ్యం. భారత ప్రభుత్వం, బీసీసీఐ అనుమతిస్తే సరిహద్దులోకి వెళ్లి జావాన్లకు సాయం చేస్తాం, ప్రతి సైనికుడి వెంట యావత్తు దేశం ఉందని తెలియజేస్తాం అని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

తర్వాతి కథనం
Show comments