Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రెండు సంవత్సరాల జీతం విరాళమిచ్చిన గౌతమ్ గంభీర్

రెండు సంవత్సరాల జీతం విరాళమిచ్చిన గౌతమ్ గంభీర్
, గురువారం, 2 ఏప్రియల్ 2020 (16:30 IST)
దేశవ్యాప్తంగా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారిపై పోరాటం చేసేందుకు సహాయంగా ప్రధాని సహాయనిధికి తన రెండు సంవత్సరాల జీతాన్ని విరాళంగా ప్రకటిస్తున్నట్లు ఢిల్లీ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి ఎంపీగా గెలిచిన టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తెలిపారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా గౌతం గంభీర్ ప్రకటించారు.
 
''మనకు ఈ దేశం ఏం చేసిందని అందరూ ప్రశ్నిస్తుంటారు. కానీ, మనం దేశానికి ఏం చేశామన్నది నిజమైన ప్రశ్న. తన రెండు సంవత్సరాల జీతాన్ని పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళంగా ఇస్తున్నానని తెలిపారు. ఈ మంచి పని కోసం మీరు ముందుకు రావాలని గంభీర్ ట్వీట్ ద్వారా పిలుపు నిచ్చారు.
 
గంభీర్‌తో పాటు ఇప్పటికే పలువురు క్రీడాకారులు, సెలబ్రిటీలు.. ఈ వైరస్‌పై పోరాటానికి సహాయార్థం తమకు తోచిన మొత్తాన్ని విరాళంగా అందించిన సంగతి తెలిసిందే. టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రూ. 50 లక్షల విరాళం ప్రకటించగా, మాజీ కెప్టెన్, బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ పేదల కోసం రూ. 50 లక్షల విలువైన బియ్యాన్ని విరాళంగా ఇచ్చాడు. సురేశ్ రైనా రూ. 52 లక్షలు, అజింక్య రహానే రూ. 10 లక్షల సాయం ప్రకటించాడు. టీమిండియా సారథి విరాట్ కోహ్లీ కూడా తన వంతు సాయం అందిస్తానని ముందుకొచ్చాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ దేశం మనకు ఏమిచ్చిందని కాదు.. దేశానికి మనం ఏం చేశామని ప్రశ్నించుకోండి...