Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాగా ఆడుతున్నా జట్టు నుంచి తప్పిస్తున్నారు: సురేష్ రైనా

తాను బాగా ఆడుతున్నప్పటికీ జట్టు నుంచి తప్పిస్తున్నారంటూ సీనియర్ క్రికెటర్ సురేష్ రైనా ఆరోపించారు. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటిస్తోంది.

Webdunia
శుక్రవారం, 16 ఫిబ్రవరి 2018 (12:07 IST)
తాను బాగా ఆడుతున్నప్పటికీ జట్టు నుంచి తప్పిస్తున్నారంటూ సీనియర్ క్రికెటర్ సురేష్ రైనా ఆరోపించారు. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటిస్తోంది. ఇప్పటికే టెస్ట్ సిరీస్ ముగియగా, శుక్రవారం జరిగే చివరి వన్డే మ్యాచ్‌తో ఆరు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ముగియనుంది. ఆ తర్వాత మూడు మ్యాచ్‌ల ట్వంటీ20 సిరీస్ ఆరంభంకానుంది. ఇందులో సురేష్ రైనా సభ్యుడిగా ఉన్నాడు. 
 
ఈ సందర్భంగా సురేష్ రైనా స్పందిస్తూ, టీమిండియా తరపున తాను బాగా ఆడినప్పటికీ జట్టు నుంచి తప్పించడం బాధించిందన్నాడు. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో తానేంటో నిరూపించుకునే సమయం వచ్చిందని ఆ అవకాశాన్ని చేజార్చుకోనని రైనా అన్నాడు. తాను బాగా రాణించినప్పటికీ తనను జట్టు నుంచి తొలగించడం బాధ కలిగించిందన్నాడు. 
 
ఇప్పుడు తాను యో-యో టెస్టు పాసయ్యానన్నారు. ఇప్పుడెంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నానని.. ఇన్ని నెలల కఠోర శిక్షణ తర్వాత మళ్లీ భారత జట్టుకు ఆడాలనే కాంక్ష మరింత బలపడిందన్నాడు. దీన్ని ఇక్కడే వదిలిపెట్టనని.. వీలైనన్ని ఎక్కువ రోజులు భారత్‌కు ఆడాలనేదే తన లక్ష్యమన్నాడు. ఇకపోతే, 2019 ప్రపంచకప్‌లో ఆడాలనుకుంటున్నానని తెలిపిన రైనా.. ఇంగ్లాండ్‌లో బాగా రాణిస్తానని తెలుసన్నాడు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments