Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ నిర్వహణపై కేంద్రానిదే తుది నిర్ణయం : కిరణ్ రిజిజు

Webdunia
ఆదివారం, 24 మే 2020 (15:32 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పోటీల నిర్వహణపై తుది నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖా మంత్రి కిరణ్ రిజిజు వ్యాఖ్యానించారు. మార్చి నెలలో ప్రారంభంకావాల్సిన ఈ ఐపీఎల్ పోటీలు కరోనా వైరస్ కారణంగా వాయిదాపడిన విషయం తెల్సిందే. 
 
అసలు ఈ యేడాది ఐపీఎల్ పోటీలు స్వదేశంలో నిర్వహిస్తారా లేదా విదేశాల్లో నిర్వహిస్తారా అన్న సందేహం ప్రతి ఒక్కరిలో నెలకొంది. ఈ నేపథ్యంలో వర్షాకాలం తర్వాత ఐపీఎల్ పోటీలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు బీసీసీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాహుల్ జోహ్రీ ఇటీవల వ్యాఖ్యానించారు. 
 
ఈ నేపథ్యంలో మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ, ఐపీఎల్ ఎప్పుడు జరపాలో నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వం అని, బీసీసీఐ కాదని స్పష్టం చేశారు. అది కూడా దేశంలో కరోనా పరిస్థితుల ఆధారంగానే కేంద్రం నిర్ణయం ఉంటుందని అన్నారు. 
 
ప్రజల ఆరోగ్యానికి ముప్పు లేదని భావించినప్పుడే కేంద్రం ఐపీఎల్ కు ఆమోదం తెలుపుతుందని తెలిపారు. కీడ్రా పోటీలు నిర్వహించడం కోసం దేశ ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టలేమని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తమ దృష్టంతా కరోనాతో పోరాడడంపైనే ఉందని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

తర్వాతి కథనం
Show comments