భారత్ క్రికెట్ జట్టు త్వరలో సౌతాఫ్రికాలో పర్యటించనుంది. ఈ పర్యటన కోసం సౌతాఫ్రికా జట్టును ఎంపిక చేశారు. ఈ నెల 26వ తేదీ నుంచి జనవరి 15 తేదీ వరకు టెస్ట్ సిరీస్ జరుగనుంది. మొత్తం మూడు టెస్టులు ఆడనుంది.
ఈ సిరీస్ కోసం 21 మందితో కూడిన సఫారీ జట్టును ఇప్పటికే ప్రకటించారు. ఇందులో సీనియర్ నటుడు డీన్ ఎల్గార్ను కెప్టెన్గా ప్రటించారు. అలాగే, టెంబా బవుమా వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నారు. జట్టులో సిసాండ్ మగాలా, రియాన్ తదితరులకు చోటు కల్పించింది.