Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పైడర్‌ కెమెరా ఆగిపోయింది.. ఆటాడుకున్న టీమిండియా క్రికెటర్లు (video)

Webdunia
సోమవారం, 6 డిశెంబరు 2021 (13:06 IST)
R Ashwin
భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరిగిన రెండో టెస్టులో ఆదివారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. మ్యాచ్‌ని కవర్‌ చేసే స్పైడర్‌ కెమెరా పిచ్‌‌‍కి తక్కువ ఎత్తులో వచ్చి ఎటూకాకుండా ఆగిపోయింది. దీన్ని పైకి లాగేందుకు గ్రౌండ్ సిబ్బంది విశ్వ ప్రయత్నాలు చేసినా కుదరలేదు. దీంతో ఏం చేయాలో తోచలేని అంపైర్లు నిర్ణీత సమయానికంటే ముందే టీ విరామం ప్రకటించారు. న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో నాలుగో ఓవర్‌ చివరి బంతికి కివీస్‌ బ్యాటర్‌ టామ్‌ లాథమ్‌ ఎల్బీగా వెనుదిరిగిన తర్వాత ఈ సంఘటన చోటుచేసుకుంది.
 
స్పైడర్‌ కెమెరా ఎటూ కాకుండా ఆగిపోవడంతో మైదానంలోని టీమిండియా క్రికెటర్లు సరదాగా ఆటాడుకున్నారు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌లు కెమెరా ముందు నిలబడి ' ఏయ్‌..ఇక్కడి నుంచి వెళ్లిపో' అన్నట్లు సంజ్ఞలిచ్చారు. ఇక స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ కూడా బాహుబలి రేంజ్‌లో కెమెరాని భుజాలమీదకు ఎత్తుతున్నట్లు పోజులిచ్చాడు. ఆ తర్వాత శ్రేయస్‌ అయ్యర్‌తో పాటు మిగతా క్రికెటర్లు కూడా కెమెరాతో ఆడుకున్నారు. వీటికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్లు కూడా మీమ్స్‌తో చెలరేగారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెరుగుతున్న అప్పులు, చేతి రుణాలతో స్నేహితుల ఒత్తిడి.. వ్యక్తి ఆత్మహత్య

ప్రియుడితో పారిపోవచ్చుగా.. నా అన్న ప్రాణాలు ఎందుకుతీశావ్... శ్రష్టి (Video)

రూ.13 లక్షల వస్తువులతో క్యూడిన బ్యాగును తిరిగిచ్చేసిన ఆటో డ్రైవర్

ఇజ్రాయేల్ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్న ఇరాన్...

గూగుల్ మ్యాప్‌ను ఫాలో అయ్యారు... గాల్లో వేలాడారు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

తర్వాతి కథనం
Show comments