Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పైడర్‌ కెమెరా ఆగిపోయింది.. ఆటాడుకున్న టీమిండియా క్రికెటర్లు (video)

Webdunia
సోమవారం, 6 డిశెంబరు 2021 (13:06 IST)
R Ashwin
భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరిగిన రెండో టెస్టులో ఆదివారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. మ్యాచ్‌ని కవర్‌ చేసే స్పైడర్‌ కెమెరా పిచ్‌‌‍కి తక్కువ ఎత్తులో వచ్చి ఎటూకాకుండా ఆగిపోయింది. దీన్ని పైకి లాగేందుకు గ్రౌండ్ సిబ్బంది విశ్వ ప్రయత్నాలు చేసినా కుదరలేదు. దీంతో ఏం చేయాలో తోచలేని అంపైర్లు నిర్ణీత సమయానికంటే ముందే టీ విరామం ప్రకటించారు. న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో నాలుగో ఓవర్‌ చివరి బంతికి కివీస్‌ బ్యాటర్‌ టామ్‌ లాథమ్‌ ఎల్బీగా వెనుదిరిగిన తర్వాత ఈ సంఘటన చోటుచేసుకుంది.
 
స్పైడర్‌ కెమెరా ఎటూ కాకుండా ఆగిపోవడంతో మైదానంలోని టీమిండియా క్రికెటర్లు సరదాగా ఆటాడుకున్నారు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌లు కెమెరా ముందు నిలబడి ' ఏయ్‌..ఇక్కడి నుంచి వెళ్లిపో' అన్నట్లు సంజ్ఞలిచ్చారు. ఇక స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ కూడా బాహుబలి రేంజ్‌లో కెమెరాని భుజాలమీదకు ఎత్తుతున్నట్లు పోజులిచ్చాడు. ఆ తర్వాత శ్రేయస్‌ అయ్యర్‌తో పాటు మిగతా క్రికెటర్లు కూడా కెమెరాతో ఆడుకున్నారు. వీటికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్లు కూడా మీమ్స్‌తో చెలరేగారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ట్రాఫిక్ రద్దీ : పారాగ్లైడింగ్ ద్వారా పరీక్షా కేంద్రానికి చేరుకున్న విద్యార్థి (Video)

గర్భం చేసింది ఎవరో తెలియదు.. పురిటి నొప్పులు భరించలేక 16 ఏళ్ల బాలిక మృతి

దూసుకొస్తున్న తుఫాను - పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!

మైసూరులో విషాదం.. తల్లి, భార్య, కుమారుడికి విషమిచ్చి చంపేసి.. తానూ...

తాగి బండిని నడిపాడు.. కారు డ్రైవింగ్ చేస్తూ 8 బైకులను ఢీకొట్టాడు... (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

తర్వాతి కథనం
Show comments