Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రమాదంలో భారత క్రికెట్ : సౌరవ్ గంగూలీ లేఖాస్త్రం

Webdunia
బుధవారం, 31 అక్టోబరు 2018 (13:12 IST)
భారత క్రికెట్ ప్రమాదంలో ఉందని మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించారు. ఈ మేరకు బోర్డు పెద్దలకు ఆయన ఓ లేఖాస్త్రాన్ని సంధించాడు. ముఖ్యంగా 'బీసీసీఐ సీఈఓ జోహ్రీపై ఆరోపణల్లో ఎంత నిజముందో నాకు తెలియదు. కానీ ఈ అంశంపై స్పందించడంలో బోర్డు ఎందుకు తాత్సారం చేస్తున్నదో అర్థం కావడం లేద'ని వ్యాఖ్యానించారు. 
 
ఇదే అంశంపై గంగూలీ రాసిన లేఖలోని అంశాలను పరిశీలిస్తే, భారత క్రికెట్‌లో ప్రస్తుతం ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశాడు. బీసీసీఐలో లైంగిక దాడుల ఆరోపణలు రావడం.. వాటిపై ఆలస్యంగా స్పందించడం గందరగోళానికి దారితీస్తున్నాయన్నారు. 
 
బీసీసీఐ వ్యవహారాలు చూస్తున్న సీవోఏలో కూడా భేదాభిప్రాయాలు పొడసూపుతున్నాయి. బోర్డులోని సన్నిహితులు కొందరు తాము ఎటువైపు మొగ్గాలో సూచించమని అడగడంతో ఏం చెప్పాలో నాకు తోచలేదు. ఎన్నోఏళ్లు భారత క్రికెట్‌కు సేవలందించిన నేను ప్రస్తుత పరిణామాలపై ఎంతో విచారిస్తున్నాను. క్రికెట్‌ అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారు అని గంగూలీ ఆ లేఖలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి షాకిచ్చిన కోర్టు

జనసేన సంస్థాగత బలోపేతం కోసం త్రిశూల్ వ్యూహం : పవన్ కళ్యాణ్

బీహార్‌లో ఒక్క ఓటు కూడా చోరీ కానివ్వం : రాహుల్ గాంధీ

యూపీఎస్పీ అభ్యర్థుల కోసం ప్రతిభా సేతు పోర్టల్

ఏలూరు జిల్లాలో కానిస్టేబుల్‌ అదృశ్యం.. ఫోన్‌ సిగ్నల్‌ కట్‌!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కేన్సర్ సోకి రూపురేఖలే మారిపోయిన కేజీఎఫ్ నటుడు

మంచి విషయం గురించి చెప్పినా విమర్శలు తప్పట్లేదు : హీరో నాని

'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు'... రజనీకాంత్

సినీ నిర్మాణ కార్మికులకు వేతనాలు పెంచిన తెలుగు ఫిల్మ్ చాంబర్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

తర్వాతి కథనం