Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసీస్ వెన్నువిరిచిన భారత బౌలర్లు : భారత్ టార్గెట్ 328 రన్స్

Webdunia
సోమవారం, 18 జనవరి 2021 (13:23 IST)
బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు ఓ ఆట ఆడుకున్నారు. భారత బౌలర్ల దెబ్బకు 294 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో లభించిన పరుగులతో కలుపుకుని మొత్తం 328 పరుగుల టార్గెట్ విధించింది. 
 
నాలుగోరోజున రెండో ఇన్నింగ్స్ నుకొనసాగించిన ఆస్ట్రేలియా జట్టును 294 పరుగులకు భారత బౌలర్లు ఆలౌట్ అయింది. తొలి టెస్ట్ ఆడుతున్న మహమ్మద్ సిరాజ్ అద్భుతంగా రాణించి ఐదు వికెట్లను పడగొట్టగా, మరో బౌలర్ శార్దూల్ ఠాకూర్‌కు నాలుగు వికెట్లు దక్కాయి. వాషింగ్టన్ సుందర్ కుఒక వికెట్ లభించింది.
 
ఆసీస్ ఆటగాళ్లలో మార్కస్ 38, వార్నర్ 48, లబుషేన్ 25, స్టీవ్ స్మిత్ 55, మ్యాథ్యూ వేడ్ 0, కెమెరాన్ గ్రీన్ 37, టిమ్ పైనీ 27, మిచెల్ స్టార్క్ 1, నాథన్ లియాన్ 13, హాజల్ వుడ్ 9 పరుగులు చేసి అవుట్ కాగా, పాట్ కమిన్స్ 28 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని, ఆస్ట్రేలియా 327 పరుగులు చేసినట్లయింది.
 
ఈ మ్యాచ్ గెలవాలంటే, భారత్ ముందు సుమారు వంద ఓవర్లకు పైగా ఉన్నాయి. దీంతో భారత ఆటగాళ్లు నిలదొక్కుకుని ఆడితే, విజయం ఏమంత అసాధ్యం కాదని క్రీడా పండితులు అంచనా వేస్తున్నారు. భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించే రోహిత్ శర్మ, శుభమన్ గిల్ సాధ్యమైనంత ఎక్కువసేపు నేడు క్రీజులో గడిపితే, రేపు చివరి రోజున ఏ ఇద్దరు రాణించి సెంచరీలు చేసినా, భారత్ గెలిచే అవకాశాలు ఉంటాయి. 

సంబంధిత వార్తలు

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

తర్వాతి కథనం
Show comments