Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మకు కరోనా పాజిటివ్

Webdunia
ఆదివారం, 26 జూన్ 2022 (10:17 IST)
భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. అయితే, తొలి టెస్టు ప్రారంభానికి ముందే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. భారత క్రికెటర్లకు నిర్వహించిన యాంటిజెన్ పరీక్షల్లో కెప్టెన్ రోహిత్ శర్మకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయన్ను క్వారంటైన్‌కు తరలించారు. వార్మప్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఆడారు. దీంతో ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లలో కరోనా కలకలం రేగింది. 
 
ఇరు జట్ల ఆటగాళ్లకు శనివారం కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇందులో రోహిత్ శర్మ ఫలితం పాజిటివ్‌గా వచ్చినట్టు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు ఆదివారం తెల్లవారుజామున ఓ ట్వీట్ చేసింది. 
 
కరోనా నిర్ధారణ కాగానే జట్టు బస చేసిన హోటల్‌లోనే అతడు క్వారంటైన్‌లోకి వెళ్లినట్టు తెలిపింది. కాగా, ప్రస్తుతం లీసెస్టర్‌షైర్‌తో జరుగుతున్న నాలుగు రోజుల వామప్ మ్యాచ్‌లో రోహిత్ ఆడుతుండడంతో ఇరు జట్లలోనూ ఆందోళన మొదలైంది. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ 25 పరుగులు చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bengaluru: స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం.. చివరికి భార్య, స్నేహితుడి చేతిలోనే?

యూఎస్ వీసా దొరకలేదు.. మనస్తాపంతో జగిత్యాలలో 25 ఏళ్ల మహిళ ఆత్మహత్య

బుడమేరు వరద వార్తలను నమ్మొద్దు, వెలగలేరు గేట్లు తెరవలేదు: ఎన్టీఆర్ కలెక్టర్ (video)

సెప్టెంబర్ చివరి వారంలో అమెరికాలో సందర్శించనున్న ప్రధాని మోదీ

Kerala man: భార్య ఉద్యోగం కోసం ఇంటిని వదిలి వెళ్లిపోయింది.. భర్త ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

తర్వాతి కథనం
Show comments