Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిట్నెస్ పరీక్షలో సక్సెస్... రోహిత్ శర్మకు లైన్ క్లియర్

Webdunia
శుక్రవారం, 11 డిశెంబరు 2020 (14:04 IST)
భారత క్రికెట్ జట్టు స్టార్ ఆటగాడు రోహిత్ శర్మకు లైన్ క్లియర్ అయింది. బెంగుళూరులోని జాతీయ క్రికెట్ అకాడెమీలో ఆయనకు నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షల్లో రోహిత్ పాస్ అయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరి వెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 
 
దుబాయ్ గడ్డపై జరిగిన ఐపీఎల్ 2020 సీజన్‌లో రోహిత్ శర్మ గాయపడిన విషయం తెల్సిందే. దీంతో రోహిత్ శర్మకు ఆస్ట్రేలియా పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్టులో చోటు కల్పించలేదు. 
 
ఈ క్రమంలో జాతీయ క్రికెట్‌ అకాడమీ(ఎన్‌సీఏ)లో శుక్రవారం వైద్య బృందం నిర్వహించిన ఫిట్నెస్‌ టెస్టులో హిట్‌మ్యాన్‌ పాసయ్యాడు. ఈ మేరకు బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. బీసీసీఐ వైద్య బృందంతోపాటు ఎన్‌సీఏ డైరెక్టర్‌ రాహుల్‌ ద్రవిడ్, సెలక్టర్ల పర్యవేక్షణలో రోహిత్‌కు ఫిట్నెస్‌ పరీక్ష నిర్వహించారు. 
 
కాగా ఫిట్‌నెస్‌ పరీక్షలో రోహిత్‌ సఫలం కావడంతో డిసెంబర్‌ 14న ఆస్ట్రేలియాకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. రోహిత్‌ నిబంధనల ప్రకారం 14 రోజుల క్వారంటైన్‌ అనంతరం జట్టుతో కలవాల్సి ఉంటుంది. దీంతో తొలి రెండు టెస్టులకు దూరం కానున్న రోహిత్‌ చివరి రెండు టెస్టులకు అందుబాటులో ఉంటాడు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments