Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీసీసీఐ కొత్త కార్యదర్శిగా రోహన్ జైట్లీ! బీసీసీఐ కాదు.. డీడీసీఎఏ ముఖ్యమంటూ కామెంట్స్!

ఠాగూర్
మంగళవారం, 27 ఆగస్టు 2024 (12:21 IST)
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కొత్త కార్యదర్శిగా రోహన్ జైట్లీ నియమితులయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బీసీసీఐ సెక్రటరీగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనయుడు జై షా కొనసాగుతున్నారు. ఈయన పదవీ కాలం వచ్చే నవంబరుతో ముగియనుంది. ఆ తర్వాత ఆయన ఐసీసీ చైర్మన్ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. దీంతో బీసీసీఐ తదుపరి కార్యదర్శిగా రోహాల్ జైట్లీ నియమితులుకానున్నారు. 
 
బీసీసీఐ కార్యదర్శి జై షా ఐసీసీ చైర్మన్ ఎన్నికల బరిలో దిగుతున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్ క్లే పదవీకాలం నవంబర్‌తో ముగియనుంది. అయితే మరోసారి ఆయన ఎన్నికల బరిలో నిలిచేందుకు నిరాసక్తి వ్యక్తం చేశాడు. దీంతో బీసీసీఐ సెక్రటరీ జై షా నిలుస్తారనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది.
 
ఒకవేళ ఆయన నిజంగానే బరిలోకి దిగితే తర్వాత బీసీసీఐ కార్యదర్శిగా ఎవరనే విషయంపై చర్చ జరుగుతోంది. అయితే తాజాగా ఓ బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి తనయుడు పేరు తెరపైకి వచ్చింది. అతనే ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) అధ్యక్షుడు రోహాన్ జైట్లీ. ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శి రేసులో ముందున్నట్లు వార్తలు వచ్చాయి. 
 
అయితే, తాజాగా ఆయన ఈ వార్తలను కొట్టిపారేశారు. తాను బీసీసీఐ సెక్రటరీ రేసులో ఉన్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ప్రస్తుతం తాను ఢిల్లీ లీగ్‌ను ప్రమోట్ చేయడంపైనే దృష్టిసారించినట్లు స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైఎస్ ఫ్యామిలీ కోసం ఇంతకాలం భరించా.. కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి : బాలినేని

తిరుమల లడ్డూ ప్రసాదంపై ప్రమాణం చేద్దామా: వైవీ సుబ్బారెడ్డికి కొలికిపూడి సవాల్

శ్రీవారి లడ్డూలో చేప నూనె - బీఫ్ టాలో - పంది కొవ్వు వినియోగం...

ఏపీలో కొత్త మద్యం పాలసీ.. రూ.99కే క్వార్టర్ బాటిల్!

తిరుపతి లడ్డూ తయారీలో ఆవు నెయ్యి స్థానంలో జంతువుల కొవ్వు కలిపారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

తర్వాతి కథనం
Show comments