Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రైజ్ మనీపై బీసీసీఐ కీలక నిర్ణయం.. పురషులతోతా పటు మహిళా క్రికెటర్లకు కూడా..

bcci

ఠాగూర్

, మంగళవారం, 27 ఆగస్టు 2024 (09:29 IST)
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవాళీ క్రికెట్ పోటీల్లో పాల్గొని రాణించే క్రికెటర్లకు సైతం నగదు బహుమతిని అందజేయాలని నిర్ణయించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచే ప్లేయర్‌లకు ప్రైజ్ మనీ ఇవ్వాలని తీర్మానించింది. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. దేశవాళీ క్రికెట్ పోటీలతో పాటు జూనియర్ క్రికెట్ టోర్నమెంట్‌లలో అద్భుతంగా రాణించే పురుష, మహిళా క్రికెటర్లకు బీసీసీఐ నగదు బహుమతి ఇవ్వనుందని జై షా వెల్లడించారు.
 
"దేశవాళీ క్రికెట్ మ్యాచ్‌లలో భాగంగా, పురుషులు, మహిళల జూనియర్ క్రికెట్ టోర్నమెంట్‌లలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ విజేతలకు ప్రైజ్ మనీ ప్రవేశపెడుతున్నాం. విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ వంటీ దేశవాళీ క్రికెట్ టోర్నీల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన వాళ్లకు ఈ ప్రైజ్ మనీ ఇస్తాం" అని జై షా తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రిటైర్మెంట్ తర్వాత ఎల్ఎల్‌సి కోసం శిఖర్ ధావన్