Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైదానంలో ఆటగాళ్లు పాదరసంలా కదిలారు.. రవిశాస్త్రి

తిరువనంతపురం వేదికగా పర్యాటక న్యూజిలాండ్ జట్టుతో జరిగిన చివరి ట్వంటీ20 మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సేన గెలుపొందడానికి గల కారణాలని భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి వెల్లడించాడు.

Webdunia
బుధవారం, 8 నవంబరు 2017 (11:33 IST)
తిరువనంతపురం వేదికగా పర్యాటక న్యూజిలాండ్ జట్టుతో జరిగిన చివరి ట్వంటీ20 మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సేన గెలుపొందడానికి గల కారణాలని భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి వెల్లడించాడు. గతంతో ఎన్నడూ కివీస్‌పై టీ20 మ్యాచ్‌ను గెలవని టీమిండియా... ఇప్పుడు ఏకంగా సిరీస్‌ను కైవసం చేైసుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశాడు.
 
దీనిపై ఆయన స్పందిస్తూ, చివరి ట్వంటీ20 మ్యాచ్‌లో భారత కుర్రోళ్లు పాదరసంలా కదిలారన్నారు. ఫలితంగా భారత్ నిర్ధేశించిన లక్ష్యం చిన్నదైనప్పటికీ ప్రత్యర్థి జట్టు విజయాన్ని సొంతం చేసుకోలేక పోయిందన్నారు. 
 
ముఖ్యంగా, 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' బుమ్రాపై ప్రశంసలు కురిపించాడు. బుమ్రా తెలివైన ఆటగాడని... ప్రత్యర్థి జట్టుకు ఏ అవకాశాన్నీ ఇవ్వలేదని కొనియాడాడు. చివరి టీ20లో బుమ్రా 9 పరుగులకు 2 వికెట్లను కూల్చిన విషయాన్ని శాస్త్రి గుర్తుచేశాడు. 
 
భారత ఇన్నింగ్స్ ముగిశాక... ఆ స్కోరును కాపాడుకోగలమనే భావించామని చెప్పాడు. 8 ఓవర్ల ఈ మ్యాచ్‌లో కేవలం 2 లేదా 3 బంతుల్లోనే మ్యాచ్ స్వరూపం మారిపోయే అవకాశం ఉంటుందన్నాడు. అద్భుతమైన క్యాచ్‌లు పడుతూ, పరుగులను నియంత్రించడంలో కోహ్లీ సేన సఫలమైందని చెప్పాడు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments