Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండియా గెలవాలని ప్రార్థిస్తున్న పాక్ జట్టు... ఎందుకు?

Webdunia
శుక్రవారం, 28 జూన్ 2019 (17:04 IST)
ప్రపంచకప్‌లో లీగ్ మ్యాచ్‌లు చివరి దశకు చేరుకున్నాయి. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా జట్టు మాత్రమే 12 పాయింట్‌లతో సెమీఫైనల్ బెర్తును ఖాయం చేసుకుంది. భారత్ మరియు న్యూజిలాండ్ జట్లు సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి. అయితే న్యూజిలాండ్ జట్టు ఇప్పటికే 7 మ్యాచ్‌లు ఆడింది. అందులో 5 మ్యాచ్‌లలో నెగ్గింది, 1 మ్యాచ్‌లో ఓడింది, 1 మ్యాచ్ వర్షం కారణంగా డ్రా అయింది. 
 
మరోపక్క భారత్ 6 మ్యాచ్‌లు ఆడింది, అందులో 5 విజయాలు సాధించగా, 1 మ్యాచ్ రద్దయింది. ఇక నాలుగో స్థానానికి మిగిలిన జట్లు పోటీ పడుతున్నాయి. ఇంగ్లండ్ 7 మ్యాచ్‌ల్లో 4 గెలిచింది, బంగ్లాదేశ్ మరియు పాకిస్థాన్ జట్లు 7 మ్యాచ్‌ల్లో 3 మ్యాచ్‌ల్లో గెలిచాయి. అయితే సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ జట్లన్నీ మిగతా మ్యాచ్‌లను తప్పనిసరిగా గెలవాలి. 
 
పాకిస్థాన్ 1992 సంవత్సరం వరల్డ్‌కప్ రిపీట్ అవుతుందని ఆశిస్తోంది. అయితే ఇప్పుడు మాత్రం భారత్ చేతిలో బంగ్లా ఓడిపోతే, తమకు సెమీస్ అవకాశాలు మెరుగ్గా ఉంటాయని పాక్ భావిస్తోంది. భారత్ ఇంకా ఇంగ్లండ్, బంగ్లాదేశ్ మరియు శ్రీలంక దేశాలతో మ్యాచ్ ఆడాలి. వీటిల్లో కనీసం ఒకటి గెలిచినా భారత్ సెమీస్‌లో ఆడుగుపెడుతుంది. 
 
మరోవైపు పాకిస్థాన్ జట్టు ఆప్ఘనిస్థాన్ మరియు బంగ్లాదేశ్ జట్లతో మ్యాచ్‌లు ఆడాలి. రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించితే సెమీస్ అవకాశాలు ఉంటాయి. బంగ్లాదేశ్ టీం బాగా రాణిస్తుండడంతో పాకిస్థాన్ కాస్త ఆలోచనలో పడింది. భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగే మ్యాచ్‌లో భారత్ గెలిచిందంటే వారికి సెమీస్ అవకాశం మెరుగ్గా ఉంటుందని పాక్ భావిస్తుంది. 
 
కొంతమంది పాక్ క్రికెటర్లు ఇప్పటికే భారత్ బంగ్లాదేశ్ చేతిలో కావాలనే ఓడిపోతుందని వ్యాఖ్యలు చేస్తున్నారు. అలా జరిగిందంటే పాక్ సెమీస్ ఆశలు గల్లంతు అవుతాయని వారు భావిస్తున్నారు. అందుకే భారత్ గెలవాలని పాక్ క్రికెటర్లు ప్రార్థిస్తున్నారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

తర్వాతి కథనం
Show comments